సిరిపురంలో శివ శక్తి ఉత్సవ వైభవంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి
సిరిపురంలో శివ శక్తి ఉత్సవ వైభవంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి
స్థానికం బృందం
కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న చిరుమర్తి లింగయ్య
స్థానికం ప్రధాన ప్రతినిధి
రామన్నపేట మండలం సిరిపురం గ్రామంలో శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి దేవాలయ తృతీయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన శ్రీ భద్రావతి భావనాఋషి కళ్యాణ మహోత్సవానికి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయంలో జరుగుతున్న వివిధ పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, పంటలు పండాలని, గ్రామం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. బ్రహ్మోత్సవాలు గ్రామంలో భక్తిశ్రద్ధలతో కూడిన ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అంబటి ఉపేంద్ర రవీందర్ రెడ్డి, బోగారం సర్పంచ్ కూనూరి సాయి కుమార్ గౌడ్, మార్కెట్జీ కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు బందెల రాములు, రైతు సమన్వయ సమితి మాజీ మండల అధ్యక్షుడు బొక్క మాధవరెడ్డి, మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ పున్న వెంకటేశం, గ్రామ శాఖ అధ్యక్షుడు బండ శ్రీనివాసరెడ్డి, నాయకులు కోనూరు ముత్తయ్య, ఎడ్ల నరేందర్ రెడ్డి, లక్ష్మయ్యతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి