Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 10:02 AM

సిరిపురంలో శివ శక్తి ఉత్సవ వైభవంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి

సిరిపురంలో శివ శక్తి ఉత్సవ వైభవంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి

సిరిపురంలో శివ శక్తి ఉత్సవ వైభవంలో మాజీ ఎమ్మెల్యే  చిరుమర్తి
January 25, 2026 05:15 PM 95 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న చిరుమర్తి లింగయ్య

స్థానికం ప్రధాన ప్రతినిధి

రామన్నపేట మండలం సిరిపురం గ్రామంలో శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి దేవాలయ తృతీయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన శ్రీ భద్రావతి భావనాఋషి కళ్యాణ మహోత్సవానికి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయంలో జరుగుతున్న వివిధ పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, పంటలు పండాలని, గ్రామం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. బ్రహ్మోత్సవాలు గ్రామంలో భక్తిశ్రద్ధలతో కూడిన ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అంబటి ఉపేంద్ర రవీందర్ రెడ్డి, బోగారం సర్పంచ్ కూనూరి సాయి కుమార్ గౌడ్, మార్కెట్జీ కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు బందెల రాములు, రైతు సమన్వయ సమితి మాజీ మండల అధ్యక్షుడు బొక్క మాధవరెడ్డి, మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ పున్న వెంకటేశం, గ్రామ శాఖ అధ్యక్షుడు బండ శ్రీనివాసరెడ్డి, నాయకులు కోనూరు ముత్తయ్య, ఎడ్ల నరేందర్ రెడ్డి, లక్ష్మయ్యతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News