సిరిపురంలో కోతుల పట్టివేత.గ్రామానికి ఊరట..!
సిరిపురంలో కోతుల పట్టివేత.గ్రామానికి ఊరట..!
స్థానికం బృందం
సర్పంచ్ అంబటి ఉపేంద్ర రవీందర్ రెడ్డి
సొంత ఖర్చులతో 100 కోతులు అడవులకు తరలింపు
రామన్నపేట స్థానిక ప్రధాన ప్రతినిధి
రామన్నపేట మండలంలోని సిరిపురం గ్రామంలో కోతుల సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా గ్రామ సర్పంచ్ కీలక చర్యలు చేపట్టారు. గ్రామస్తుల విజ్ఞప్తుల మేరకు తన సొంత ఖర్చులతో సుమారు వంద కోతులను సోమవారం పట్టివేసి అడవుల్లోకి తరలించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ అంబటి ఉపేంద్ర రవీందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో కోతుల బెడద తీవ్రంగా ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పంటలు, ఇళ్లపై దాడులు, నిత్యజీవితానికి ఆటంకం ఏర్పడుతున్న నేపథ్యంలో సమస్యను దశలవారీగా పరిష్కరించాలనే ఉద్దేశంతో కోతుల పట్టివేత కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. పట్టుకున్న కోతులను సురక్షితంగా శ్రీశైలం అడవుల్లో విడిచిపెట్టనున్నట్టు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ మూడుదూడ్ల రమేష్ అనూష, నాయకులు బండ శ్రీనివాస్ రెడ్డి, కూనూరు ముత్తయ్య, వార్డు సభ్యులు సూర్యకళ, గాద శంకరయ్య, కూనూరు రమేష్, పున్న వెంకటేష్, పగడాల లక్ష్మి తదితరులు పాల్గొని సహకరించారు. సర్పంచ్ చర్యపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి