సిరిపురంలో ఘనంగా స్వామి వివేకానంద 164వ జయంతి ఉత్సవాలు
సిరిపురంలో ఘనంగా స్వామి వివేకానంద 164వ జయంతి ఉత్సవాలు
Editor Desk
సిరిపురం:
భారతీయ జనతా పార్టీ సిరిపురం గ్రామ శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 164వ జయంతి ఉత్సవాలు బస్టాండ్ ఆవరణలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో బీజేపీతో పాటు బీఆర్ఎస్కు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
బీజేపీ గ్రామ ప్రభారి ఏళ్ల సంజీవ రెడ్డి, ఉపసర్పంచ్ ముడుదుడ్ల అనూష రమేష్, వార్డ్ మెంబర్లు పగుడాల లక్ష్మి, గుంటోజు కృష్ణమాచారి, శక్తి కేంద్రం అధ్యక్షుడు జెల్లా లక్ష్మీనారాయణ, సీనియర్ నాయకులు బడుగు యాదగిరి, రాపోలు స్వామి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.అలాగే బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఏలే వెంకట నర్సయ్య, ప్రధాన కార్యదర్శి గజం సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు వడ్డేపల్లి శ్రీను, కార్యదర్శి సంగిశెట్టి వేణు, కోశాధికారి రాపోలు శ్రీశైలం, ఆర్ఎస్ఎస్ శిక్షకులు పొట్టబత్తుల వెంకటేశం, కొంగరి వెంకటేశం, సంగిశెట్టి నరేష్, కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ తరఫున మాజీ ఎంపీటీసీ పున్న వెంకటేశం, మాజీ ఉపసర్పంచ్ దాసిరెడ్డి శ్రవణ్ కుమార్ రెడ్డి, మాజీ వార్డ్ మెంబర్ కునూరు ముత్యాలు హాజరై స్వామి వివేకానంద ఆశయాలను స్మరించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యువతకు స్వామి వివేకానంద జీవితం, సేవాభావం, దేశభక్తి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. యువత జాతీయ భావజాలంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి