Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 04:19 AM

సిరిపురంలో ఘనంగా నేతాజీ జయంతి వేడుకలు

సిరిపురంలో ఘనంగా నేతాజీ జయంతి వేడుకలు

సిరిపురంలో ఘనంగా నేతాజీ జయంతి వేడుకలు
January 23, 2026 06:29 PM 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
స్థానికం ప్రధాన ప్రతినిధి

భారతీయ జనతా పార్టీ సిరిపురం గ్రామ శాఖ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గ్రామ బస్టాండ్ ఆవరణలో జరిగిన కార్యక్రమానికి గ్రామ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ సందర్భంగా నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గ్రామ ప్రభారి ఏళ్ల సంజీవ రెడ్డి, ఉపసర్పంచ్ ముడుదుడ్ల అనూష రమేష్, మాజీ సర్పంచ్ అప్పం లక్ష్మీనర్సు, మాజీ ఎంపీటీసీ పున్న వెంకటేశం పాల్గొని నేతాజీ త్యాగస్ఫూర్తిని కొనియాడారు.వార్డు సభ్యులు పగుడాల లక్ష్మి, గుంటోజు కృష్ణమాచారి, కంకల అర్చన మల్లేష్, మందడి ఉపేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు రాపోలు స్వామి పాల్గొన్నారు.బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఏలే వెంకట నర్సయ్య, ప్రధాన కార్యదర్శి గజం సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు వడ్డేపల్లి శ్రీను, కోశాధికారి రాపోలు శ్రీశైలం, పొట్టబత్తుల వెంకటేశం, కొంగరి వెంకటేశం, అప్పం వెంకటేశం, మాజీ వార్డు సభ్యుడు బండ శ్రీనివాస్ రెడ్డి, కునూరు ముతయ్య, కార్యవర్గ సభ్యులు, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని నేతాజీకి ఘన నివాళులు అర్పించారు.నేతాజీ దేశ స్వాతంత్ర్య సాధన కోసం చేసిన త్యాగాలు యువతకు ఆదర్శమని, ఆయన చూపిన మార్గాన్ని అనుసరించి దేశాభివృద్ధికి కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News