Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:50 PM

సిర్గాపూర్‌లో చీఫ్ మినిస్టర్ కప్ టార్చ్ ర్యాలీ ఘనంగా నిర్వహణ

సిర్గాపూర్‌లో చీఫ్ మినిస్టర్ కప్ టార్చ్ ర్యాలీ ఘనంగా నిర్వహణ

సిర్గాపూర్‌లో చీఫ్ మినిస్టర్ కప్ టార్చ్ ర్యాలీ ఘనంగా నిర్వహణ
January 09, 2026 08:22 PM 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి :

సిర్గాపూర్ గ్రామంలో చీఫ్ మినిస్టర్ కప్ టార్చ్ ర్యాలీ ఉత్సాహంగా,ఉల్లాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రావు పటిల్ హాజరై ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత క్రీడలలో చురుకుగా పాల్గొని గ్రామానికి, మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు.ఈ ర్యాలీలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సిర్గాపూర్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నాగరం శ్రీనివాస్ పర్యవేక్షణలో విద్యార్థులు క్రీడా స్పూర్తిని ప్రతిబింబించే నినాదాలు చేస్తూ ర్యాలీని మరింత ఉత్సాహభరితంగా మార్చారు. ఉపాధ్యాయులు కూడా విద్యార్థులతో కలిసి నడుచుతూ వారికి ప్రోత్సాహం అందించారు.గ్రామ ప్రజలు, యువత, క్రీడాభిమానులు ర్యాలీకి ఘన స్వాగతం పలకడంతో గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది. ర్యాలీ గ్రామంలోని ప్రధాన వీధుల మీదుగా సాగుతూ ప్రజల్లో క్రీడల పట్ల అవగాహన పెంచింది. అనంతరం గ్రామపంచాయతీ ప్రాంగణంలో ర్యాలీ ముగిసింది.ఈ కార్యక్రమం ద్వారా యువతలో క్రీడలపై ఆసక్తి మరింత పెరిగిందని గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News