PRINT TIME: April 11, 2026 11:00 AM
సికింద్రాబాద్లో BRS ర్యాలీ ఉద్రిక్తతకు దారి
సికింద్రాబాద్లో BRS ర్యాలీ ఉద్రిక్తతకు దారి
January 17, 2026 11:12 AM
80 Views
స్థానికం ప్రతినిధి :
LB Nagar,Dilsuknagar,Vanastalipuram,Hayatnagar
AJAY
హైదరాబాద్ స్టానికం ప్రతినిధి
సికింద్రాబాద్:
సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సాధన కోసం భారత్ రాష్ట్ర సమితి (BRS) చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ర్యాలీగా ముందుకు కదులుతున్న BRS శ్రేణులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
అనంతరం ర్యాలీని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. లాఠీచార్జ్ సమయంలో పలువురు BRS కార్యకర్తలు స్వల్ప గాయాలు పాలయ్యారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుందన్న ఆందోళనతో పోలీసులు భారీగా బలగాలను మోహరించారు.
ప్రస్తుతం సికింద్రాబాద్ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పరిస్థితి అదుపులో ఉందని పోలీసులు వెల్లడించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి