Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 11:07 PM

సికింద్రాబాద్‌లో BRS ర్యాలీ ఉద్రిక్తతకు దారి

సికింద్రాబాద్‌లో BRS ర్యాలీ ఉద్రిక్తతకు దారి

సికింద్రాబాద్‌లో BRS ర్యాలీ ఉద్రిక్తతకు దారి
January 17, 2026 11:12 AM 96 Views
Reporter
స్థానికం ప్రతినిధి : LB Nagar,Dilsuknagar,Vanastalipuram,Hayatnagar
AJAY

హైదరాబాద్ స్టానికం ప్రతినిధి

సికింద్రాబాద్:

సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సాధన కోసం భారత్ రాష్ట్ర సమితి (BRS) చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ర్యాలీగా ముందుకు కదులుతున్న BRS శ్రేణులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.

అనంతరం ర్యాలీని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. లాఠీచార్జ్ సమయంలో పలువురు BRS కార్యకర్తలు స్వల్ప గాయాలు పాలయ్యారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతుందన్న ఆందోళనతో పోలీసులు భారీగా బలగాలను మోహరించారు.

ప్రస్తుతం సికింద్రాబాద్ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పరిస్థితి అదుపులో ఉందని పోలీసులు వెల్లడించారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News