దళిత బహుజన బిడ్డ తమిళనాడు సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం గర్వించదగ్గ విషయం
భావితరాలకు బహుజన రాజ్య స్థాపనకు బాటలు వెయ్యాలి
ఎమ్మార్పీఎస్ కార్మిక శాఖ రాష్ట్ర అధ్యక్షులు చింత బాబు మాదిగ
తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ దళపతి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా, సోమవారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. కోదాడ నియోజకవర్గ ఇన్చార్జి బచ్చలకూరి నాగరాజు మాదిగ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, స్వీట్లు పంచుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ కార్మిక శాఖ రాష్ట్ర అధ్యక్షులు చింత బాబు మాదిగ మాట్లాడుతూ..దళిత బహుజన వర్గానికి చెందిన వ్యక్తి తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టడం గర్వకారణమని, ప్రజలకు సుపరిపాలన అందించాలని ఆకాంక్షించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి