PRINT TIME: July 11, 2026 08:34 AM
శివనామ స్మరణతో మార్మోగిన నిదానపల్లి గుట్ట
శివనామ స్మరణతో మార్మోగిన నిదానపల్లి గుట్ట
January 14, 2026 06:42 PM
324 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
నలుమూలల నుంచి భక్తుల రాకతో కిటకిటలాడిన నిదానపల్లి గుట్ట
నిదాన పెళ్లి గుట్టపై భోగి వేడుకలు
రామన్నపేటస్థానికం ప్రధాన ప్రతినిధి
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గుట్టపై స్వయంభుగా వెలసిన శ్రీ స్వయంభు భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం వద్ద మకర సంక్రాంతిని పురస్కరించుకుని భోగి రోజున భక్తుల సందడి నెలకొంది. నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు బోనాలతో ఆలయానికి చేరుకుని పటాలు, ముగ్గులతో పూజలు నిర్వహించి ఓం నమశ్శివాయ స్మరణతో భక్తిశ్రద్ధలతో పరవశించారు.
అనంతరం మల్లికార్జున ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్పంచ్ నరపాక మాధవి–యాదయ్య, మాజీ సర్పంచ్ గుత్తా నర్సింహారెడ్డి, వార్డు సభ్యులు గ్రామ పెద్దలు యువకులు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు . ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి