శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలి – బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కోఆర్డినేటర్ అనిల్కుమార్
శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలి – బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కోఆర్డినేటర్ అనిల్కుమార్
స్థానికం బృందం
రామగిరి, స్థానిక ప్రధాన ప్రతినిధి
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2025–26 విద్యా సంవత్సరానికి యూజీ, పీజీ కోర్సుల్లో చేరిన విద్యార్థులంతా వర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించే శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలని బీఆర్ ఏవీయూ నల్లగొండ రీజినల్ కోఆర్డినేషన్ సెంటర్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ బొజ్జ అనిల్కుమార్ అన్నారు.ఆదివారం నల్లగొండలోని రీజినల్ కోఆర్డినేషన్ సెంటర్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలోని ఎన్జీ కళాశాల స్టడీ సెంటర్తో పాటు ఇతర అధ్యయన కేంద్రాల్లో తరగతుల నిర్వహణ కొనసాగుతుందని తెలిపారు. ప్రతి విద్యార్థి విధిగా తరగతులకు హాజరై, కౌన్సిలర్లు బోధించే పాఠ్యాంశాలను పూర్తిగా అర్థం చేసుకోవాలని సూచించారు.విద్యార్థులు తప్పనిసరిగా అసైన్మెంట్లు సమర్పించాల్సి ఉంటుందని, వాటికి సంబంధించిన పూర్తి సమాచారం విద్యార్థుల మొబైల్ ఫోన్లు, ఈమెయిల్ ఐడీలకు అందుతుందని తెలిపారు. అకాడమిక్ అంశాలపై అవగాహన పెంచేందుకు ఫోన్-ఇన్ కార్యక్రమాల ద్వారా కూడా మార్గనిర్దేశం చేస్తున్నామని చెప్పారు.వర్సిటీ కార్యకలాపాలకు సంబంధించిన పూర్తి వివరాలకు నల్లగొండలోని రీజినల్ కోఆర్డినేషన్ సెంటర్ను లేదా 9533101295, 7989339180 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి