అందోల్, స్థానికం ప్రతినిధి
షటిల్ నైట్ అవుట్ సక్రమంగా నడపాలని ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చూడాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిమ్మ రమేష్, టేక్మాల్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ తిమ్మిగారి సుధాకర్ మెదక్ RTC DM సురేఖ ని కోరడం జరిగింది. సోమవారం నాడు మధ్యాహ్నం DM ను కలిసి టేక్మాల్ కు నడుపుతున్న బస్సులను అర్ధాంతనంగా రద్దు చేసిన విషయాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా ఉదయం సమయంలో మెదక్ వెళ్లాలంటే బస్సులు ఆలస్యంగా నడుస్తున్నాయని ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవాలసి వస్తుందని వివరించారు. టేక్మాల్ నుండి హైదరాబాద్ ఉదయం బస్సు సౌకర్యం కల్పించాలని డిఎం ని కలిసి విజ్ఞప్తి చేశారు. ఇందులో టేక్మాల్ నాయకులు మాజీ సర్పంచ్ ఆకులపల్లి పాపయ్య, యూత్ కాంగ్రెస్ వాస్ ప్రెసిడెంట్ సాయిశేషు గౌడ్ పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి