Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 12:53 AM

శత వసంతోత్సవాల ముగింపుకు రామన్నపేట నుంచి ఎర్రసైన్యం తరలింపు

శత వసంతోత్సవాల ముగింపుకు రామన్నపేట నుంచి ఎర్రసైన్యం తరలింపు

శత వసంతోత్సవాల ముగింపుకు రామన్నపేట నుంచి ఎర్రసైన్యం తరలింపు
January 18, 2026 02:52 PM 18 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సీపీఐ శత వసంతోత్సవాల ముగింపు సభకు రామన్నపేట నుంచి భారీ తరలింప

స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

ఖమ్మం జిల్లాలో నిర్వహించనున్న భారత కమ్యూనిస్టు పార్టీ శత వసంతోత్సవాల ముగింపు బహిరంగ సభకు రామన్నపేట నుంచి పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో బయలుదేరారు. రామన్నపేట సీపీఐ మండల కార్యదర్శి ఊట్కూరి నరసింహ ఆధ్వర్యంలో ఈ తరలింపు ఉత్సాహంగా సాగింది.

ఈ సందర్భంగా ఊట్కూరి నరసింహ మాట్లాడుతూ “పోరాడే వానిదే ఎర్రజెండా. ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండే పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ” అని స్పష్టం చేశారు. కార్మికులు, రైతులు, పేదల హక్కుల కోసం నిరంతరం పోరాటాలు సాగిస్తున్న పార్టీగా సీపీఐకి ప్రత్యేక చరిత్ర ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఎర్ర రమేష్ గౌడ్, మండల సహాయ కార్యదర్శి కళ్లెం రామచంద్రు, రామన్నపేట పట్టణ కార్యదర్శి రచ్చ యాదగిరి పాల్గొన్నారు. అలాగే ఏఐటీయూసీ మండల అధ్యక్షులు శివరాత్రి సమ్మయ్య, రైతు సంఘం అధ్యక్షులు ఊట్కూరి కృష్ణతో పాటు ఏనుతుల రమేష్, ఊట్కూరి భగవంత, బాలగోని మల్లయ్య, గంగాపురం యాదయ్య, గంగాపురం వెంకటయ్య, వీరమల్ల ముత్తయ్య, సుదర్శన్, శంకర్, సదానందం, కడయ్య, అంజయ్య, నరసింహ చారి, పెండెం రవి, అందే పాండు, కళ్లెం యాదగిరి, గొరిగే శంకరయ్య, ఎర్ర బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.పార్టీ పిలుపునకు స్పందించిన శ్రేణుల ఉత్సాహం సభ విజయానికి నిదర్శనంగా నిలిచిందని నాయకులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News