Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:28 PM

శ్రీ వరవర రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవం కరపత్ర ఆవిష్కరణ

శ్రీ వరవర రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవం కరపత్ర ఆవిష్కరణ

శ్రీ వరవర రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవం కరపత్ర ఆవిష్కరణ
March 26, 2026 08:24 PM 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

శ్రీ వరవర రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవం కరపత్ర ఆవిష్కరణ

కోదాడ మండల పరిధిలోని గణపవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వరవర రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన పోస్టర్ ని గురువారం దేవాలయం చైర్మన్ ఇర్ల వరహాల్ రెడ్డి ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేవాలయ చైర్మన్, ధర్మకర్తలు, గ్రామ పెద్దల సమక్షంలో పోస్టర్ ఆవిష్కరించినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో 450 సంవత్సరాల చరిత్ర గల వరవర రంగనాయక స్వామి దేవాలయం సౌత్ ఇండియాలోనే అతిపెద్ద దేవాలయం అని అన్నారు. ఈ దేవాలయానికి ముఖద్వారాన్ని ఏర్పాటు చేయడానికి 10 వ తరగతి బ్యాచ్ వాళ్ళము 14 లక్షలు కలెక్ట్ చేసి ఈ ముఖద్వారాన్ని ఏర్పాటు చేస్తున్నామని వారు అన్నారు. దేవాలయ అభివృద్ధికి దాతలు సహకరించాలని అన్నారు. శ్రీ వరవర రంగనాయక స్వామి దేవాలయ కళ్యాణ మహోత్సవం రోజువారి జరిగే కార్యక్రమాలు ది.29-03-2026-నుండి 04-04-2026 వరకు దేవాలయ కార్యక్రమాలు జరగనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు కంపసాటి ఐతమ్ రాజ్, పిడమర్తి తిరపమ్మ, శెట్టి అప్పారావు, రాపోలు పెద్ద వీరయ్య, బాలేబోయిన వెంకటేశ్వర్లు, ఆత్కూరి నాగేశ్వరరావు, గ్రామ పెద్దలు బల్గూరి దుర్గయ్య, సానికొమ్మి తరుణ్ కుమార్ రెడ్డి, బండి చినకోటయ్య, కాసాని శ్రీను, గడ్డం రామిరెడ్డి, ఇర్ల శ్రీనివాసరెడ్డి, జంగం శ్రీను, కొండ ధనమూర్తి, వెంకట్రావు, ఆలయ అర్చకులు. తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News