శ్రీ వరవర రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవం కరపత్ర ఆవిష్కరణ
శ్రీ వరవర రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవం కరపత్ర ఆవిష్కరణ
Harish HS
శ్రీ వరవర రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవం కరపత్ర ఆవిష్కరణ
కోదాడ మండల పరిధిలోని గణపవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వరవర రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన పోస్టర్ ని గురువారం దేవాలయం చైర్మన్ ఇర్ల వరహాల్ రెడ్డి ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేవాలయ చైర్మన్, ధర్మకర్తలు, గ్రామ పెద్దల సమక్షంలో పోస్టర్ ఆవిష్కరించినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో 450 సంవత్సరాల చరిత్ర గల వరవర రంగనాయక స్వామి దేవాలయం సౌత్ ఇండియాలోనే అతిపెద్ద దేవాలయం అని అన్నారు. ఈ దేవాలయానికి ముఖద్వారాన్ని ఏర్పాటు చేయడానికి 10 వ తరగతి బ్యాచ్ వాళ్ళము 14 లక్షలు కలెక్ట్ చేసి ఈ ముఖద్వారాన్ని ఏర్పాటు చేస్తున్నామని వారు అన్నారు. దేవాలయ అభివృద్ధికి దాతలు సహకరించాలని అన్నారు. శ్రీ వరవర రంగనాయక స్వామి దేవాలయ కళ్యాణ మహోత్సవం రోజువారి జరిగే కార్యక్రమాలు ది.29-03-2026-నుండి 04-04-2026 వరకు దేవాలయ కార్యక్రమాలు జరగనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు కంపసాటి ఐతమ్ రాజ్, పిడమర్తి తిరపమ్మ, శెట్టి అప్పారావు, రాపోలు పెద్ద వీరయ్య, బాలేబోయిన వెంకటేశ్వర్లు, ఆత్కూరి నాగేశ్వరరావు, గ్రామ పెద్దలు బల్గూరి దుర్గయ్య, సానికొమ్మి తరుణ్ కుమార్ రెడ్డి, బండి చినకోటయ్య, కాసాని శ్రీను, గడ్డం రామిరెడ్డి, ఇర్ల శ్రీనివాసరెడ్డి, జంగం శ్రీను, కొండ ధనమూర్తి, వెంకట్రావు, ఆలయ అర్చకులు. తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి