భక్తుల సౌకర్యార్థం గోడను ముందుకు జరపడం – దేవాలయ కమిటీ
చౌటుప్పల్ మండలం చిన్న కొండూరు గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ ప్రహరీ గోడ విస్తరణ పనులను ప్రారంభం చేశారు. దేవాలయ కమిటీ చైర్మన్ ఎరుకుల రాందాస్ గౌడ్, పాలకవర్గ సభ్యులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా దేవాలయ అధ్యక్షులు మాట్లాడుతూ, భక్తుల రాకపోకలకు మరింత సౌకర్యం కల్పించేందుకు ప్రహరీ గోడను ముందుకు జరపాలని నిర్ణయించామని తెలిపారు. ఆలయ పూజారి కొండూరు నరసింహ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ తీగుళ్ల చంద్రయ్య, ఉపసర్పంచ్ గడ్డం సత్తయ్య హాజరయ్యారు. వార్డు సభ్యులు, దేవాలయ కమిటీ పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి