షార్ట్సర్క్యూట్తో రైతులకు భారీ నష్టం. 20 ఎకరాల్లో గడ్డి కట్టలు దగ్ధం
షార్ట్సర్క్యూట్తో రైతులకు భారీ నష్టం. 20 ఎకరాల్లో గడ్డి కట్టలు దగ్ధం
Editor Desk
బోర్లు, హెచ్డీ పైపులు అగ్నికి ఆహుతి
రామన్నపేట, మండలంలోని వెల్లంకి గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ వద్ద జరిగిన షార్ట్సర్క్యూట్తో భారీ అగ్నిప్రమాదం సంభవించి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రమాదంలో పశువుల కోసం నిల్వ ఉంచిన గడ్డి కట్టలు పూర్తిగా దగ్ధమయ్యాయి.
రైతులు నీల శేఖర్, పోలు జితేందర్రెడ్డి తమ 20 ఎకరాల భూమిలో ఆవులు, గేదెల కోసం సుమారు 600 గడ్డి కట్టలు నిల్వ ఉంచగా అవన్నీ అగ్నికి ఆహుతయ్యాయని తెలిపారు. అలాగే పోలు వెంకట్రెడ్డికి చెందిన మరో 600 గడ్డి కట్టలు, ఒక బోరు, సుమారు 600 మీటర్ల హెచ్డీ పైపులు కూడా పూర్తిగా కాలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యుత్ స్తంభం ఏర్పాటు చేయకపోవడం వల్లే షార్ట్సర్క్యూట్ జరిగి ఈ ప్రమాదం సంభవించిందని రైతులు ఆరోపించారు. ఘటనపై సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు స్పందించి వెంటనే నష్టాన్ని అంచనా వేసి బాధిత రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.
సమస్య తెలిసిన వెంటనే తహసీల్దార్ కార్యాలయం నుంచి ఆర్ఐ శోభ, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పంచనామ నిర్వహించారు. ప్రభుత్వం తక్షణ ఆర్థిక సాయం అందించి బాధిత రైతులను ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి