Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 07:55 AM

షార్ట్‌సర్క్యూట్‌తో రైతులకు భారీ నష్టం. 20 ఎకరాల్లో గడ్డి కట్టలు దగ్ధం

షార్ట్‌సర్క్యూట్‌తో రైతులకు భారీ నష్టం. 20 ఎకరాల్లో గడ్డి కట్టలు దగ్ధం

షార్ట్‌సర్క్యూట్‌తో రైతులకు భారీ నష్టం. 20 ఎకరాల్లో గడ్డి కట్టలు దగ్ధం
May 23, 2026 08:03 PM 116 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బోర్లు, హెచ్‌డీ పైపులు అగ్నికి ఆహుతి

రామన్నపేట, మండలంలోని వెల్లంకి గ్రామంలో ట్రాన్స్‌ఫార్మర్ వద్ద జరిగిన షార్ట్‌సర్క్యూట్‌తో భారీ అగ్నిప్రమాదం సంభవించి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రమాదంలో పశువుల కోసం నిల్వ ఉంచిన గడ్డి కట్టలు పూర్తిగా దగ్ధమయ్యాయి.

రైతులు నీల శేఖర్, పోలు జితేందర్‌రెడ్డి తమ 20 ఎకరాల భూమిలో ఆవులు, గేదెల కోసం సుమారు 600 గడ్డి కట్టలు నిల్వ ఉంచగా అవన్నీ అగ్నికి ఆహుతయ్యాయని తెలిపారు. అలాగే పోలు వెంకట్‌రెడ్డికి చెందిన మరో 600 గడ్డి కట్టలు, ఒక బోరు, సుమారు 600 మీటర్ల హెచ్‌డీ పైపులు కూడా పూర్తిగా కాలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యుత్ స్తంభం ఏర్పాటు చేయకపోవడం వల్లే షార్ట్‌సర్క్యూట్ జరిగి ఈ ప్రమాదం సంభవించిందని రైతులు ఆరోపించారు. ఘటనపై సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు స్పందించి వెంటనే నష్టాన్ని అంచనా వేసి బాధిత రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.

సమస్య తెలిసిన వెంటనే తహసీల్దార్ కార్యాలయం నుంచి ఆర్‌ఐ శోభ, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పంచనామ నిర్వహించారు. ప్రభుత్వం తక్షణ ఆర్థిక సాయం అందించి బాధిత రైతులను ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News