PRINT TIME: April 10, 2026 09:09 AM
శబరిమల యాత్రకు బయలుదేరిన అయ్యప్ప స్వాములు
శబరిమల యాత్రకు బయలుదేరిన అయ్యప్ప స్వాములు
January 09, 2026 05:39 PM
244 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి
రామన్నపేట మండలం ఇస్కిల్ల గ్రామంలో శుక్రవారం భక్తి పారవశ్యం నెలకొంది. హరిహర పుత్రుడు మణికంఠకు అంకితమై మండల దీక్షను భక్తిశ్రద్ధలతో పూర్తి చేసుకున్న అయ్యప్ప స్వాములు శబరిమల క్షేత్ర దర్శనానికి బయలుదేరారు. గురుస్వామి రాపర్తి గణేష్ నేతృత్వంలో యాత్ర ప్రారంభమైంది.గ్రామంలోని అయ్యప్ప ఆలయం నుంచి స్వాముల నామస్మరణలతో యాత్ర సాగింది. “స్వామియే శరణం అయ్యప్ప” నినాదాలతో గ్రామం మార్మోగింది. శబరిమల దర్శనానికి బయలుదేరిన వారిలో శ్రీను గురుస్వామి, నవీన్ గురుస్వామి, సైదులు గురుస్వామి, యాదగిరి, రవి, విజయ్, కుమార్, మల్లేష్, మహేష్, సాయికుమార్, ఉదయ్ తదితరులు ఉన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి