శబరిమల నుంచి తిరుగు ప్రయాణంలో ఈస్ట్ హస్తినాపురం వాసి మృతి
శబరిమల నుంచి తిరుగు ప్రయాణంలో ఈస్ట్ హస్తినాపురం వాసి మృతి
Editor Desk
రోడ్డు ప్రమాదంలో అశోక్ మృతి… కాలనీలో విషాదఛాయలు
వనస్థలిపురం స్థానిక ప్రధాన ప్రతినిధి
వనస్థలిపురం డివిజన్ పరిధిలోని ఈస్ట్ హస్తినాపురం కాలనీకి చెందిన అశోక్ (విద్యుత్ శాఖ ఉద్యోగి) శబరిమల దర్శనం ముగించుకుని కారులో తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.ఈ అకస్మాత్తు దుర్ఘటనతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, కాలనీ వాసులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఘటన విషయం తెలిసిన వెంటనే వనస్థలిపురం డివిజన్ కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి, క్రిస్టియన్ కాలనీ అధ్యక్షుడు హరిందర్ రెడ్డి, ఈస్ట్ హస్తినాపురం కాలనీ అధ్యక్షుడు సతీష్ గౌడ్ అశోక్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ కఠిన సమయంలో ధైర్యంగా ఉండాలని సూచిస్తూ, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అశోక్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని భగవంతుడు కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని కోరుకున్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి