Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:08 PM

సీనియర్ నాయకులు బెల్లి మల్లయ్య, పాలకూరి నర్సింహ మృతి. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్

సీనియర్ నాయకులు బెల్లి మల్లయ్య, పాలకూరి నర్సింహ మృతి. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్

సీనియర్ నాయకులు బెల్లి మల్లయ్య, పాలకూరి నర్సింహ మృతి.   సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్
May 23, 2026 05:25 PM 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సీపీఎం సీనియర్ నాయకులు బెల్లి మల్లయ్య, పాలకూరి నర్సింహ మరణం పార్టీకి, ప్రజా ఉద్యమాలకు తీరని లోటని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ అన్నారు. కొమ్మయిగూడెం గ్రామానికి చెందిన సీపీఎం సీనియర్ నాయకుడు బెల్లి మల్లయ్య, శోభనాద్రిపురం గ్రామానికి చెందిన పాలకూరి నర్సింహ అనారోగ్యంతో మృతి చెందగా, సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జహంగీర్‌తో పాటు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేకా అశోక్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇద్దరు నాయకులు గ్రామాల్లో ప్రజా సమస్యలపై పార్టీ చేపట్టిన ఉద్యమాలకు బాసటగా నిలిచారని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధి, ప్రజా హక్కుల కోసం నిరంతరం పోరాడిన నాయకులుగా గుర్తింపు పొందారని తెలిపారు.

బెల్లి మల్లయ్య రావణపేట గ్రామపంచాయతీ వార్డు సభ్యుడిగా, శాఖ కార్యదర్శిగా పనిచేస్తూ అనేక ఆటుపోట్లను ఎదుర్కొని గ్రామంలో పార్టీ బలోపేతానికి కృషి చేశారని అన్నారు. పాలకూరి నర్సింహ కందాల రంగారెడ్డి సారథ్యంలో శోభనాద్రిపురం గ్రామంలో దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహిస్తూ చివరి వరకు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేశారని కొనియాడారు.

ఏకకాలంలో ఇద్దరు నిబద్ధత కలిగిన కామ్రేడ్స్‌ను కోల్పోవడం బాధాకరమని, వారి ఆశయస్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజా ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లాలని నాయకులు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జల్లెల పెంటయ్య, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, బొడ్డుపల్లి వెంకటేశం, కూరెళ్ల నర్సింహాచారి, కందుల హనుమంతు, కల్లూరి నాగేష్, నాగటి ఉపేందర్, ఎండీ రషీద్, బొడిగే రజిత, నీల ఐలయ్య, గంటెపాక శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News