Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 02:39 AM

సీపీఐ ఆధ్వర్యంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

సీపీఐ ఆధ్వర్యంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

సీపీఐ ఆధ్వర్యంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
January 26, 2026 10:52 AM 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానిక ప్రధాన ప్రతినిధి

భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని బుడ్డేకల్ పార్టీ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఏఐటీయూసీ జిల్లా సమితి సభ్యులు ఓబీ నాగరాజు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సీపీఐ పట్టణ కార్యదర్శి టి. వీరేష్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం దేశానికి ఇచ్చిన ప్రజాస్వామ్య హక్కులు, సమానత్వం, లౌకికత వంటి మూల్యాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం సాధన కోసం సీపీఐ నిరంతరం పోరాటం చేస్తోందని స్పష్టం చేశారు.ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు, ముఖ్యంగా కార్మిక వర్గం ఐక్యంగా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. గణతంత్ర దినోత్సవం కేవలం వేడుకగానే కాకుండా రాజ్యాంగ విలువలను ఆచరణలో పెట్టే దినంగా మలచుకోవాలని పిలుపునిచ్చారు.

అనంతరం ఈ నెల 30న విజయవాడలో నిర్వహించనున్న ఏఐవైఎఫ్ నిరుద్యోగి రణభేరి కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి వెంకన్న, సీపీఐ మండల కార్యదర్శి కల్లుబావిరాజు, సీపీఐ పట్టణ సహాయ కార్యదర్శులు కె. రమేష్ కుమార్, లక్ష్మీనారాయణ, ఏఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి గోరుకల్లు అంజిత్ గౌడ్, నాయకులు షేక్షావలి, సత్యనారాయణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News