Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హోమియో ఆయుష్ డే సందర్భంగా యోగ అవగాహన కార్యక్రమం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 01:20 PM

సీపీఐ ఆధ్వర్యంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

సీపీఐ ఆధ్వర్యంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

సీపీఐ ఆధ్వర్యంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
January 26, 2026 10:52 AM 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానిక ప్రధాన ప్రతినిధి

భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని బుడ్డేకల్ పార్టీ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఏఐటీయూసీ జిల్లా సమితి సభ్యులు ఓబీ నాగరాజు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సీపీఐ పట్టణ కార్యదర్శి టి. వీరేష్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం దేశానికి ఇచ్చిన ప్రజాస్వామ్య హక్కులు, సమానత్వం, లౌకికత వంటి మూల్యాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం సాధన కోసం సీపీఐ నిరంతరం పోరాటం చేస్తోందని స్పష్టం చేశారు.ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు, ముఖ్యంగా కార్మిక వర్గం ఐక్యంగా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. గణతంత్ర దినోత్సవం కేవలం వేడుకగానే కాకుండా రాజ్యాంగ విలువలను ఆచరణలో పెట్టే దినంగా మలచుకోవాలని పిలుపునిచ్చారు.

అనంతరం ఈ నెల 30న విజయవాడలో నిర్వహించనున్న ఏఐవైఎఫ్ నిరుద్యోగి రణభేరి కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి వెంకన్న, సీపీఐ మండల కార్యదర్శి కల్లుబావిరాజు, సీపీఐ పట్టణ సహాయ కార్యదర్శులు కె. రమేష్ కుమార్, లక్ష్మీనారాయణ, ఏఐవైఎఫ్ పట్టణ కార్యదర్శి గోరుకల్లు అంజిత్ గౌడ్, నాయకులు షేక్షావలి, సత్యనారాయణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News