Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 03:21 AM

సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణంలో అధికారికంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణంలో అధికారికంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణంలో అధికారికంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
January 26, 2026 11:03 AM 76 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
స్థానిక ప్రధాన ప్రతినిధి

భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 26న సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను అధికారికంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి జి. సబిత జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ద్వితీయ శ్రేణి మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి డి. సతయ్య, ప్రభుత్వ న్యాయవాది ఎస్. శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.ఏ. మజీద్‌తో పాటు న్యాయవాదులు, సంఘ సభ్యులు, కోర్టు సిబ్బంది హాజరయ్యారు.

జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం రాజ్యాంగ విలువలు, దేశ సమైక్యత, స్వేచ్ఛ, న్యాయ వ్యవస్థ ప్రాధాన్యతపై ప్రసంగాలు నిర్వహించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలను ప్రతి పౌరుడు ఆచరణలో పాటించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.గణతంత్ర దినోత్సవం దేశ సమగ్రతను, ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేసే ముఖ్యమైన జాతీయ పర్వదినమని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News