Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హెడ్ కానిస్టేబుల్ అంగోతు యాదగిరికి ఘన నివాళి పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 02:41 PM

సీనియర్ సీఆర్‌పీ వ్యూహంతో సమాఖ్యలకు కొత్త ఊపిరి

సీనియర్ సీఆర్‌పీ వ్యూహంతో సమాఖ్యలకు కొత్త ఊపిరి

సీనియర్ సీఆర్‌పీ వ్యూహంతో సమాఖ్యలకు కొత్త ఊపిరి
January 30, 2026 06:42 PM 6 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లాలో బలోపేతమైన మండల సమాఖ్యలు

గ్రామీణ పేదల అభివృద్ధే లక్ష్యంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో సీనియర్ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ వ్యూహం విజయవంతంగా అమలైంది. జిల్లాలోని ఆరుగురు అనుభవజ్ఞులైన సీఆర్‌పీలు మూడు బృందాలుగా విడిపోయి 17 మండల సమాఖ్యలను విస్తృతంగా సందర్శించి రెండు రోజులపాటు లోతైన శిక్షణ అందించారు.మండల సమాఖ్యల ఆర్థిక నిర్వహణ, ఖాతాల నిర్వహణ, ఆడిట్ విధానాలు, పాలనా ప్రక్రియలు, నిర్ణయాధికార వ్యవస్థలపై స్పష్టమైన అవగాహన కల్పించారు. దీంతో సమాఖ్యల పనితీరులో పారదర్శకత పెరగడంతో పాటు సంస్థాగత సామర్థ్యం మరింత బలపడిందని అధికారులు వెల్లడించారు.శిక్షణ అనంతరం జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో శిక్షణ అనుభవాలు, ఎదురైన సమస్యలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి టి. నాగిరెడ్డి, ప్రాజెక్ట్ మేనేజర్ భీమయ్య, అదనపు డీఆర్‌డీఓ కె. జంగారెడ్డి, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు కె. రేణుకతో పాటు మండల సమాఖ్యల అధ్యక్షులు,అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా డీఆర్‌డీఓ టి. నాగిరెడ్డి మాట్లాడుతూ, మండల సమాఖ్యలు ఆర్థికంగా స్వావలంబన సాధించి పాలనలో ఆదర్శంగా నిలవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. శిక్షణలో పొందిన అంశాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని సూచించారు.

ఈ వ్యూహంతో మండల సమాఖ్యల నిర్వహణలో గణనీయమైన మార్పు రానుందని, గ్రామీణ అభివృద్ధికి ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News