సీఎం సహాయ నిధుల చెక్కుల పంపిణీ
సీఎం సహాయ నిధుల చెక్కుల పంపిణీ
Editor Desk
రూ.1.40 లక్షల చెక్కులు అందజేసిన కాంగ్రెస్ నాయకులు
రామన్నపేట స్థానికం ప్రధాన ప్రతినిధి
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి ముఖ్యమంత్రి సహాయ నిధుల నుంచి మంజూరైన మొత్తం రూ.1,40,000 విలువైన చెక్కులను సీనియర్ కాంగ్రెస్ నాయకులు బత్తుల క్రిష్ణ గౌడ్, నవీన్ కుమార్ బాధితులకు పంపిణీ చేశారు.శాసనసభ్యులు వేముల వీరేశం సహకారంతో మంజూరైన ఈ చెక్కులను బాధితులు ఎరుకల సుధాకర్, భీమగాని లింగస్వామి, బెక్కంటి యాదయ్య, తోర్పునూరి అచ్చయ్యలకు గ్రామ వార్డు సభ్యులు నీల అయిలయ్య, రేగులగడ్డ నరేష్, వేముల పాపులు అందజేశారు.
ఈ సందర్భంగా గ్రామ నాయకులు మాట్లాడుతూ, పేద ప్రజలకు ఏ ఆపద వచ్చినా ప్రభుత్వం తరఫున అండగా నిలుస్తామని, పార్టీలు–కులాలు చూడకుండా బాధితులకు తప్పకుండా సహాయం అందిస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బత్తుల యాదయ్య, దశరథ, నీల నరసింహా, పిట్టల సత్తయ్య, దొంతరబోయిన వెంకన్న, మెండే కొండలు, మెండే కృష్ణ, బత్తుల మల్లేశ్, నీల యాదయ్య, మద్దేగళ్ళ రాములు, దాసరి మల్లేశ్, బత్తుల రమేష్, కొమ్ము నరసింహా, నాలికే నిరంజన్ కలిమెర రాజు, టి.నరేష్, మద్దేగళ్ళ వెంకన్న, బజ్జూరు సురేష్, బత్తుల వెంకన్న, ఉప్పలయ కిట్టు, దేవేందర్, సాయి, మచ్ఛి ప్రవీణ్, చింటు, రామకృష్ణ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి