Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:52 PM

సీఎం రిలీఫ్ ఫండ్, కల్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ చేసిన బీర్ల అయిలయ్య

సీఎం రిలీఫ్ ఫండ్, కల్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ చేసిన బీర్ల అయిలయ్య

సీఎం రిలీఫ్ ఫండ్, కల్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ చేసిన బీర్ల అయిలయ్య
January 11, 2026 05:30 PM 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ సీఎం రిలీఫ్ ఫండ్, కల్యాణ లక్ష్మీ వంటి పథకాలు

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

యాదగిరిగుట్ట పట్టణంలోని ప్రభుత్వ విప్,కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సీఎం రిలీఫ్ ఫండ్'కల్యాణ లక్ష్మీ పథకం కింద మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఆలేరు నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలకు సంబంధించిన సుమారు 200 మంది సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు సుమారు 100 కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ సీఎం రిలీఫ్ ఫండ్, కల్యాణ లక్ష్మీ వంటి పథకాల ద్వారా ఆర్థికంగా బలహీన వర్గాలకు అండగా నిలుస్తోందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తామని తెలిపారు.ఈ ప్రభుత్వ పథకాలు పేద, కుటుంబాల ఆర్థిక భారం తగ్గించేందుకు కీలకంగా పనిచేస్తున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) ద్వారా అందుతున్న ఆర్థిక సాయం వల్ల ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వేధింపులు తగ్గుతున్నాయని గుర్తుచేశారు.కళ్యాణ లక్ష్మి చెక్కులు స్వీకరించే యువతులకు ఇది పెళ్లిళ్ల ఖర్చులు, కుటుంబ పరిరక్షణకు చాలా ఉపకారపడుతుందన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు,లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News