సీఎం రిలీఫ్ ఫండ్, కల్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ చేసిన బీర్ల అయిలయ్య
సీఎం రిలీఫ్ ఫండ్, కల్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ చేసిన బీర్ల అయిలయ్య
Sthanikam District Staff Reporter
రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ సీఎం రిలీఫ్ ఫండ్, కల్యాణ లక్ష్మీ వంటి పథకాలు
స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్
యాదగిరిగుట్ట పట్టణంలోని ప్రభుత్వ విప్,కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సీఎం రిలీఫ్ ఫండ్'కల్యాణ లక్ష్మీ పథకం కింద మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఆలేరు నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలకు సంబంధించిన సుమారు 200 మంది సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు సుమారు 100 కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ సీఎం రిలీఫ్ ఫండ్, కల్యాణ లక్ష్మీ వంటి పథకాల ద్వారా ఆర్థికంగా బలహీన వర్గాలకు అండగా నిలుస్తోందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తామని తెలిపారు.ఈ ప్రభుత్వ పథకాలు పేద, కుటుంబాల ఆర్థిక భారం తగ్గించేందుకు కీలకంగా పనిచేస్తున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) ద్వారా అందుతున్న ఆర్థిక సాయం వల్ల ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వేధింపులు తగ్గుతున్నాయని గుర్తుచేశారు.కళ్యాణ లక్ష్మి చెక్కులు స్వీకరించే యువతులకు ఇది పెళ్లిళ్ల ఖర్చులు, కుటుంబ పరిరక్షణకు చాలా ఉపకారపడుతుందన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు,లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి