Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:54 AM

సేంద్రియ సాగుతోనే ఆరోగ్య సమాజం

సేంద్రియ సాగుతోనే ఆరోగ్య సమాజం

సేంద్రియ సాగుతోనే ఆరోగ్య సమాజం
24-01-2026 52 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
కంచనపల్లి, స్థానికం ప్రధాన ప్రతినిధి

సేంద్రియ వ్యవసాయమే సమాజానికి దిశానిర్దేశకమని చాటి చెప్పేలా కంచనపల్లి గ్రామంలో శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నల్గొండ ఎన్జీ ప్రభుత్వ కళాశాల (స్వ) జాతీయ సేవా పథకం నాలుగో విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న శీతాకాల ప్రత్యేక శిబిరంలో భాగంగా గ్రామంలో అవగాహన ర్యాలీ చేపట్టారు.గ్రామ వీధుల గుండా సాగిన ఈ ర్యాలీలో వాలంటీర్లు సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించుదాం, నేలమ్మ తల్లిని కాపాడుకుందాం, సేంద్రియ సాగుతో ఆరోగ్యాన్ని పెంచుకుందాం అంటూ నినాదాలు చేస్తూ ప్రజలను చైతన్యపరిచారు.

ఈ కార్యక్రమంలో జాతీయ సేవా పథకం కార్యక్రమాధికారి మంద సావిత్రి పాల్గొని, సేంద్రియ వ్యవసాయం వల్ల నేల సారాన్ని కాపాడుకోవచ్చని, ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందని వివరించారు. వాలంటీర్లు గ్రామస్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి సేంద్రియ ఎరువుల ప్రయోజనాలను వివరించారు. దీనికి స్పందించిన గ్రామ ప్రజలు తమ అనుభవాలను పంచుకున్నారు.మధ్యాహ్నం అనంతరం నిర్వహించిన అవగాహన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వెల్లండి శ్రీధర్ గారు సేంద్రియ ఎరువుల వినియోగంతో నాణ్యమైన పంట చేతికొస్తుందని, రసాయనాల వాడకం వల్ల కలిగే అనర్థాలను నివారించవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో కంచనపల్లి పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు రామకృష్ణ గారు, జాతీయ సేవా పథకం వాలంటీర్లు పాల్గొన్నారు. అనంతరం వాలంటీర్లు గ్రామంలో శ్రమదానం చేసి సేవాభావాన్ని చాటుకున్నారు.

Sthanikam

సేంద్రియ సాగుతోనే ఆరోగ్య సమాజం

Article Image
కంచనపల్లి, స్థానికం ప్రధాన ప్రతినిధి

సేంద్రియ వ్యవసాయమే సమాజానికి దిశానిర్దేశకమని చాటి చెప్పేలా కంచనపల్లి గ్రామంలో శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నల్గొండ ఎన్జీ ప్రభుత్వ కళాశాల (స్వ) జాతీయ సేవా పథకం నాలుగో విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న శీతాకాల ప్రత్యేక శిబిరంలో భాగంగా గ్రామంలో అవగాహన ర్యాలీ చేపట్టారు.గ్రామ వీధుల గుండా సాగిన ఈ ర్యాలీలో వాలంటీర్లు సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించుదాం, నేలమ్మ తల్లిని కాపాడుకుందాం, సేంద్రియ సాగుతో ఆరోగ్యాన్ని పెంచుకుందాం అంటూ నినాదాలు చేస్తూ ప్రజలను చైతన్యపరిచారు.

ఈ కార్యక్రమంలో జాతీయ సేవా పథకం కార్యక్రమాధికారి మంద సావిత్రి పాల్గొని, సేంద్రియ వ్యవసాయం వల్ల నేల సారాన్ని కాపాడుకోవచ్చని, ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందని వివరించారు. వాలంటీర్లు గ్రామస్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి సేంద్రియ ఎరువుల ప్రయోజనాలను వివరించారు. దీనికి స్పందించిన గ్రామ ప్రజలు తమ అనుభవాలను పంచుకున్నారు.మధ్యాహ్నం అనంతరం నిర్వహించిన అవగాహన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వెల్లండి శ్రీధర్ గారు సేంద్రియ ఎరువుల వినియోగంతో నాణ్యమైన పంట చేతికొస్తుందని, రసాయనాల వాడకం వల్ల కలిగే అనర్థాలను నివారించవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో కంచనపల్లి పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు రామకృష్ణ గారు, జాతీయ సేవా పథకం వాలంటీర్లు పాల్గొన్నారు. అనంతరం వాలంటీర్లు గ్రామంలో శ్రమదానం చేసి సేవాభావాన్ని చాటుకున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News