Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 04:15 AM

సేంద్రియ సాగుతోనే ఆరోగ్య సమాజం

సేంద్రియ సాగుతోనే ఆరోగ్య సమాజం

సేంద్రియ సాగుతోనే ఆరోగ్య సమాజం
January 24, 2026 04:38 PM 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
కంచనపల్లి, స్థానికం ప్రధాన ప్రతినిధి

సేంద్రియ వ్యవసాయమే సమాజానికి దిశానిర్దేశకమని చాటి చెప్పేలా కంచనపల్లి గ్రామంలో శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నల్గొండ ఎన్జీ ప్రభుత్వ కళాశాల (స్వ) జాతీయ సేవా పథకం నాలుగో విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న శీతాకాల ప్రత్యేక శిబిరంలో భాగంగా గ్రామంలో అవగాహన ర్యాలీ చేపట్టారు.గ్రామ వీధుల గుండా సాగిన ఈ ర్యాలీలో వాలంటీర్లు సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించుదాం, నేలమ్మ తల్లిని కాపాడుకుందాం, సేంద్రియ సాగుతో ఆరోగ్యాన్ని పెంచుకుందాం అంటూ నినాదాలు చేస్తూ ప్రజలను చైతన్యపరిచారు.

ఈ కార్యక్రమంలో జాతీయ సేవా పథకం కార్యక్రమాధికారి మంద సావిత్రి పాల్గొని, సేంద్రియ వ్యవసాయం వల్ల నేల సారాన్ని కాపాడుకోవచ్చని, ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందని వివరించారు. వాలంటీర్లు గ్రామస్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి సేంద్రియ ఎరువుల ప్రయోజనాలను వివరించారు. దీనికి స్పందించిన గ్రామ ప్రజలు తమ అనుభవాలను పంచుకున్నారు.మధ్యాహ్నం అనంతరం నిర్వహించిన అవగాహన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వెల్లండి శ్రీధర్ గారు సేంద్రియ ఎరువుల వినియోగంతో నాణ్యమైన పంట చేతికొస్తుందని, రసాయనాల వాడకం వల్ల కలిగే అనర్థాలను నివారించవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో కంచనపల్లి పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు రామకృష్ణ గారు, జాతీయ సేవా పథకం వాలంటీర్లు పాల్గొన్నారు. అనంతరం వాలంటీర్లు గ్రామంలో శ్రమదానం చేసి సేవాభావాన్ని చాటుకున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News