Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 01:42 AM

సేంద్రియ సాగుతోనే ఆరోగ్య సమాజం

సేంద్రియ సాగుతోనే ఆరోగ్య సమాజం

సేంద్రియ సాగుతోనే ఆరోగ్య సమాజం
January 24, 2026 04:38 PM 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
కంచనపల్లి, స్థానికం ప్రధాన ప్రతినిధి

సేంద్రియ వ్యవసాయమే సమాజానికి దిశానిర్దేశకమని చాటి చెప్పేలా కంచనపల్లి గ్రామంలో శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నల్గొండ ఎన్జీ ప్రభుత్వ కళాశాల (స్వ) జాతీయ సేవా పథకం నాలుగో విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న శీతాకాల ప్రత్యేక శిబిరంలో భాగంగా గ్రామంలో అవగాహన ర్యాలీ చేపట్టారు.గ్రామ వీధుల గుండా సాగిన ఈ ర్యాలీలో వాలంటీర్లు సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించుదాం, నేలమ్మ తల్లిని కాపాడుకుందాం, సేంద్రియ సాగుతో ఆరోగ్యాన్ని పెంచుకుందాం అంటూ నినాదాలు చేస్తూ ప్రజలను చైతన్యపరిచారు.

ఈ కార్యక్రమంలో జాతీయ సేవా పథకం కార్యక్రమాధికారి మంద సావిత్రి పాల్గొని, సేంద్రియ వ్యవసాయం వల్ల నేల సారాన్ని కాపాడుకోవచ్చని, ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందని వివరించారు. వాలంటీర్లు గ్రామస్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి సేంద్రియ ఎరువుల ప్రయోజనాలను వివరించారు. దీనికి స్పందించిన గ్రామ ప్రజలు తమ అనుభవాలను పంచుకున్నారు.మధ్యాహ్నం అనంతరం నిర్వహించిన అవగాహన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వెల్లండి శ్రీధర్ గారు సేంద్రియ ఎరువుల వినియోగంతో నాణ్యమైన పంట చేతికొస్తుందని, రసాయనాల వాడకం వల్ల కలిగే అనర్థాలను నివారించవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో కంచనపల్లి పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు రామకృష్ణ గారు, జాతీయ సేవా పథకం వాలంటీర్లు పాల్గొన్నారు. అనంతరం వాలంటీర్లు గ్రామంలో శ్రమదానం చేసి సేవాభావాన్ని చాటుకున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News