సుదీర్ఘకాలం పోలీసు శాఖలో సేవలు అందించడం అభినందనీయం.
సుదీర్ఘకాలం పోలీసు శాఖలో సేవలు అందించడం అభినందనీయం.
Biksham
స్థానికం ప్రతినిధి బిక్షం
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పోలీస్ స్టేషన్ నందు ఏఎస్ఐ గా పని చేస్తున్న రాములు ద్యోగవిరమణ పొందినారు. ఈ సందర్భంగా ఉద్యోగవిరణ పొందిన ఏఎస్ఐ ని వారి కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో జిల్లా పోలీస్ కార్యలయంలో ఎస్పి కె.నరసింహ ఘనంగా సన్మానించారు, ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. పోలీసు డిపార్ట్మెంట్ నందు సుదీర్ఘకాలం సేవలు అందించడం గొప్పవిషయం అని, అభినందనీయం అని వారి సేవలను అభినందించారు, క్లిష్టమైన పోలీసు ఉద్యోగ విధుల నిర్వహణలో గృహిణిగా భర్తకు సహాయ సహకారాలు అందించడంలో భార్య సేవలు విలువైనవి అన్నారు. ఇంటిని, పిల్లలను ప్రయోజకులను చేయడంలో బార్య పాత్ర కీలమైనది అన్నారు. కానిస్టేబుల్ గా ఉద్యోగంలో చేరి ఈ స్థాయికి చేరడం, జీవిత ప్రయాణంలో సంపూర్ణ సంతోషకరమైన ఉన్నత కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నారు అని కొనియాడారు. ఈ ఉద్యోవిరమణ అనంతరము వారి కుటుంబ సభ్యుల అందరితో సుఖ సంతోషలతో గడపాలని అని, ప్రజా సేవలో పాల్గొనాలని కోరుకుంటున్నాము అని తెలిపినారు. రిటైర్మెంట్ అనేది వయస్సు కే కానీ మనసుకు కాదు నచ్చిన పనిలో కృషి చేయాలని అన్నారు.
అధికారులు, తోటి ఉద్యోగులు, స్నేహితులు బంధువులు మాట్లాడుతూ విధులలో అంకితభావంతో, బాధ్యతతో పని చేసేవారనీ, కష్టపడే తత్వం కలవారని, అధికారులకు, క్రిందిస్తాయి సిబ్బందితో కలుపుకుని పోయేవారు అని తెలిపినారు..
ఈ కార్యక్రమంలో అడ్మిన్ అదనపు ఎస్పి రవీందర్ రెడ్డి, ఏఅర్ ఆధనపు ఎస్పి జనార్ధన్ రెడ్డి, ఏవో మంజు భార్గవి, డిఎస్పీ నరసింహ చారి, పోలీసు సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎస్సై రామచందర్, వెల్ఫేర్ ఎస్ఐ సాయిరాం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి