Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:29 AM

సుదీర్ఘకాలం పోలీసు శాఖలో సేవలు అందించడం అభినందనీయం.

సుదీర్ఘకాలం పోలీసు శాఖలో సేవలు అందించడం అభినందనీయం.

సుదీర్ఘకాలం పోలీసు శాఖలో సేవలు అందించడం అభినందనీయం.
December 31, 2025 05:22 PM 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పోలీస్ స్టేషన్ నందు ఏఎస్ఐ గా పని చేస్తున్న రాములు ద్యోగవిరమణ పొందినారు. ఈ సందర్భంగా ఉద్యోగవిరణ పొందిన ఏఎస్ఐ ని వారి కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో జిల్లా పోలీస్ కార్యలయంలో ఎస్పి కె.నరసింహ ఘనంగా సన్మానించారు, ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. పోలీసు డిపార్ట్మెంట్ నందు సుదీర్ఘకాలం సేవలు అందించడం గొప్పవిషయం అని, అభినందనీయం అని వారి సేవలను అభినందించారు, క్లిష్టమైన పోలీసు ఉద్యోగ విధుల నిర్వహణలో గృహిణిగా భర్తకు సహాయ సహకారాలు అందించడంలో భార్య సేవలు విలువైనవి అన్నారు. ఇంటిని, పిల్లలను ప్రయోజకులను చేయడంలో బార్య పాత్ర కీలమైనది అన్నారు. కానిస్టేబుల్ గా ఉద్యోగంలో చేరి ఈ స్థాయికి చేరడం, జీవిత ప్రయాణంలో సంపూర్ణ సంతోషకరమైన ఉన్నత కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నారు అని కొనియాడారు. ఈ ఉద్యోవిరమణ అనంతరము వారి కుటుంబ సభ్యుల అందరితో సుఖ సంతోషలతో గడపాలని అని, ప్రజా సేవలో పాల్గొనాలని కోరుకుంటున్నాము అని తెలిపినారు. రిటైర్మెంట్ అనేది వయస్సు కే కానీ మనసుకు కాదు నచ్చిన పనిలో కృషి చేయాలని అన్నారు.

అధికారులు, తోటి ఉద్యోగులు, స్నేహితులు బంధువులు మాట్లాడుతూ విధులలో అంకితభావంతో, బాధ్యతతో పని చేసేవారనీ, కష్టపడే తత్వం కలవారని, అధికారులకు, క్రిందిస్తాయి సిబ్బందితో కలుపుకుని పోయేవారు అని తెలిపినారు..

ఈ కార్యక్రమంలో అడ్మిన్ అదనపు ఎస్పి రవీందర్ రెడ్డి, ఏఅర్ ఆధనపు ఎస్పి జనార్ధన్ రెడ్డి, ఏవో మంజు భార్గవి, డిఎస్పీ నరసింహ చారి, పోలీసు సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎస్సై రామచందర్, వెల్ఫేర్ ఎస్ఐ సాయిరాం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News