Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 09:10 AM

సూర్యాపేట స్వామినారాయణ్ గురుకుల్‌కు జాతీయస్థాయి ఘనత

సూర్యాపేట స్వామినారాయణ్ గురుకుల్‌కు జాతీయస్థాయి ఘనత

సూర్యాపేట స్వామినారాయణ్ గురుకుల్‌కు జాతీయస్థాయి ఘనత
January 07, 2026 02:40 PM 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

SHRESHTA ప్రవేశ పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంకు 490

సూర్యాపేట స్థానిక ప్రధాన ప్రతినిధి

సూర్యాపేట జిల్లా సమీపంలోని చివ్వేంల మండలం ఉండ్రుగొండ గ్రామంలో ఉన్న శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ అంతర్జాతీయ పాఠశాల మరోసారి జాతీయ స్థాయిలో తన ప్రతిభను నిరూపించింది.ఈ పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థి కొప్పాకుల హర్ష, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన SHRESHTA–9వ తరగతి ప్రవేశ పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంకు 490 సాధించి ఘన విజయాన్ని అందుకున్నాడు. దేశవ్యాప్తంగా సుమారు 12 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్న ఈ ప్రతిష్టాత్మక పరీక్షలో 490వ ర్యాంకు సాధించడం విశేషమని పాఠశాల ప్రిన్సిపాల్ సిహెచ్. శ్రీనివాస్ ఆనంద్ తెలిపారు.

ఈ విజయానికి పాఠశాల అందిస్తున్న నాణ్యమైన విద్య, క్రమశిక్షణతో కూడిన బోధనతో పాటు పూజ్య మంత్రస్వరూపదాస్ స్వామీజీ ఆశీర్వాదాలు, మార్గదర్శకత్వం ప్రధాన కారణాలని విద్యార్థి తల్లిదండ్రులు కొప్పాకుల శంకర్ పేర్కొన్నారు.విద్యార్థి హర్ష భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకొని పాఠశాలకు, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ప్రిన్సిపాల్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం విద్యార్థిని ప్రత్యేకంగా అభినందించింది. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ హార్దిక్, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

మీ స్పందన? 3 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News