సూర్యాపేట స్వామినారాయణ్ గురుకుల్కు జాతీయస్థాయి ఘనత
సూర్యాపేట స్వామినారాయణ్ గురుకుల్కు జాతీయస్థాయి ఘనత
Editor Desk
SHRESHTA ప్రవేశ పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంకు 490
సూర్యాపేట స్థానిక ప్రధాన ప్రతినిధి
సూర్యాపేట జిల్లా సమీపంలోని చివ్వేంల మండలం ఉండ్రుగొండ గ్రామంలో ఉన్న శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ అంతర్జాతీయ పాఠశాల మరోసారి జాతీయ స్థాయిలో తన ప్రతిభను నిరూపించింది.ఈ పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థి కొప్పాకుల హర్ష, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన SHRESHTA–9వ తరగతి ప్రవేశ పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంకు 490 సాధించి ఘన విజయాన్ని అందుకున్నాడు. దేశవ్యాప్తంగా సుమారు 12 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్న ఈ ప్రతిష్టాత్మక పరీక్షలో 490వ ర్యాంకు సాధించడం విశేషమని పాఠశాల ప్రిన్సిపాల్ సిహెచ్. శ్రీనివాస్ ఆనంద్ తెలిపారు.
ఈ విజయానికి పాఠశాల అందిస్తున్న నాణ్యమైన విద్య, క్రమశిక్షణతో కూడిన బోధనతో పాటు పూజ్య మంత్రస్వరూపదాస్ స్వామీజీ ఆశీర్వాదాలు, మార్గదర్శకత్వం ప్రధాన కారణాలని విద్యార్థి తల్లిదండ్రులు కొప్పాకుల శంకర్ పేర్కొన్నారు.విద్యార్థి హర్ష భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకొని పాఠశాలకు, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ప్రిన్సిపాల్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం విద్యార్థిని ప్రత్యేకంగా అభినందించింది. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ హార్దిక్, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి