Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శిథిలావస్థకు చేరిన బాలికల హాస్టల్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:44 PM

సూర్యాపేట జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలో భారీ చేరికలు

సూర్యాపేట జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలో భారీ చేరికలు

సూర్యాపేట జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలో భారీ చేరికలు
03-01-2026 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సావిత్రిబాయి ఫులే జయంతి సందర్భంగా పదవుల నియామకాలు

తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ వట్టే జానయ్య యాదవ్

సూర్యాపేట స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి వివిధ పార్టీల నుంచి భారీగా నాయకులు, కార్యకర్తలు చేరారు. మహిళా విద్య కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయురాలు సావిత్రిబాయి ఫులే జయంతి సందర్భంగా పార్టీ ముఖ్య కార్యకర్తల సమక్షంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ వట్టే జానయ్య యాదవ్, పార్టీ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజ గౌడ్ పాల్గొన్నారు. అనంతరం పార్టీ పదవుల నియామక కార్యక్రమం నిర్వహించారు.

వట్టే జానయ్య యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజ గౌడ్ కొత్త నాయకులకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వట్టే జానయ్య యాదవ్ మాట్లాడుతూ జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి కార్యాచరణాత్మక కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అలాగే నీరజ గౌడ్ మాట్లాడుతూ మహిళల్లో రాజకీయ, సామాజిక చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని, రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ముందుకు వచ్చి పార్టీలో చేరాలని కోరారు.

పదవుల నియామకాలు:

▪ సూర్యాపేట జిల్లా మహిళా అధ్యక్షురాలు – కొన్నె మంజుల గౌడ్

▪ జిల్లా ప్రధాన కార్యదర్శి – నారాయణదాసు కవిత

▪ సూర్యాపేట పట్టణ ఎస్టీ సెల్ అధ్యక్షుడు – ధరావత్ సేవ్యానాయక్

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజ గౌడ్, జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య, ప్రధాన కార్యదర్శి మీర్ అక్బర్, పట్టణ అధ్యక్షుడు కుంభం నాగరాజు, ఆత్మకూరు (ఎస్) మండల పార్టీ అధ్యక్షుడు బొల్లె సైదులు, యువజన విభాగం అధ్యక్షుడు కోల కరుణాకర్ ముదిరాజ్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఏశబోయిన మల్లేష్, బొమ్మగాని సైదులు, పగిళ్ల శరత్, లింగాల సైదులు, సేవ్యానాయక్, కొన్నె మంజుల, నారాయణదాసు కవిత, కడియం వంశీ, మహేష్ తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సావిత్రిబాయి ఫులే జయంతి సందర్భంగా విద్య, సమానత్వం, సామాజిక చైతన్యం కోసం మరింత కృషి చేయాలని ఈ సందర్భంగా పార్టీ నాయకులు ప్రతిజ్ఞ చేశారు.


Sthanikam

సూర్యాపేట జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలో భారీ చేరికలు

Article Image

సావిత్రిబాయి ఫులే జయంతి సందర్భంగా పదవుల నియామకాలు

తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ వట్టే జానయ్య యాదవ్

సూర్యాపేట స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి వివిధ పార్టీల నుంచి భారీగా నాయకులు, కార్యకర్తలు చేరారు. మహిళా విద్య కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయురాలు సావిత్రిబాయి ఫులే జయంతి సందర్భంగా పార్టీ ముఖ్య కార్యకర్తల సమక్షంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ వట్టే జానయ్య యాదవ్, పార్టీ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజ గౌడ్ పాల్గొన్నారు. అనంతరం పార్టీ పదవుల నియామక కార్యక్రమం నిర్వహించారు.

వట్టే జానయ్య యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజ గౌడ్ కొత్త నాయకులకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వట్టే జానయ్య యాదవ్ మాట్లాడుతూ జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి కార్యాచరణాత్మక కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అలాగే నీరజ గౌడ్ మాట్లాడుతూ మహిళల్లో రాజకీయ, సామాజిక చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని, రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ముందుకు వచ్చి పార్టీలో చేరాలని కోరారు.

పదవుల నియామకాలు:

▪ సూర్యాపేట జిల్లా మహిళా అధ్యక్షురాలు – కొన్నె మంజుల గౌడ్

▪ జిల్లా ప్రధాన కార్యదర్శి – నారాయణదాసు కవిత

▪ సూర్యాపేట పట్టణ ఎస్టీ సెల్ అధ్యక్షుడు – ధరావత్ సేవ్యానాయక్

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజ గౌడ్, జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య, ప్రధాన కార్యదర్శి మీర్ అక్బర్, పట్టణ అధ్యక్షుడు కుంభం నాగరాజు, ఆత్మకూరు (ఎస్) మండల పార్టీ అధ్యక్షుడు బొల్లె సైదులు, యువజన విభాగం అధ్యక్షుడు కోల కరుణాకర్ ముదిరాజ్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఏశబోయిన మల్లేష్, బొమ్మగాని సైదులు, పగిళ్ల శరత్, లింగాల సైదులు, సేవ్యానాయక్, కొన్నె మంజుల, నారాయణదాసు కవిత, కడియం వంశీ, మహేష్ తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సావిత్రిబాయి ఫులే జయంతి సందర్భంగా విద్య, సమానత్వం, సామాజిక చైతన్యం కోసం మరింత కృషి చేయాలని ఈ సందర్భంగా పార్టీ నాయకులు ప్రతిజ్ఞ చేశారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News