Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 02:00 PM

సూర్యాపేట జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలో భారీ చేరికలు

సూర్యాపేట జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలో భారీ చేరికలు

సూర్యాపేట జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలో భారీ చేరికలు
January 03, 2026 06:25 PM 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సావిత్రిబాయి ఫులే జయంతి సందర్భంగా పదవుల నియామకాలు

తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ వట్టే జానయ్య యాదవ్

సూర్యాపేట స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి వివిధ పార్టీల నుంచి భారీగా నాయకులు, కార్యకర్తలు చేరారు. మహిళా విద్య కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయురాలు సావిత్రిబాయి ఫులే జయంతి సందర్భంగా పార్టీ ముఖ్య కార్యకర్తల సమక్షంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ వట్టే జానయ్య యాదవ్, పార్టీ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజ గౌడ్ పాల్గొన్నారు. అనంతరం పార్టీ పదవుల నియామక కార్యక్రమం నిర్వహించారు.

వట్టే జానయ్య యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజ గౌడ్ కొత్త నాయకులకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వట్టే జానయ్య యాదవ్ మాట్లాడుతూ జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి కార్యాచరణాత్మక కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అలాగే నీరజ గౌడ్ మాట్లాడుతూ మహిళల్లో రాజకీయ, సామాజిక చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని, రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ముందుకు వచ్చి పార్టీలో చేరాలని కోరారు.

పదవుల నియామకాలు:

▪ సూర్యాపేట జిల్లా మహిళా అధ్యక్షురాలు – కొన్నె మంజుల గౌడ్

▪ జిల్లా ప్రధాన కార్యదర్శి – నారాయణదాసు కవిత

▪ సూర్యాపేట పట్టణ ఎస్టీ సెల్ అధ్యక్షుడు – ధరావత్ సేవ్యానాయక్

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజ గౌడ్, జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య, ప్రధాన కార్యదర్శి మీర్ అక్బర్, పట్టణ అధ్యక్షుడు కుంభం నాగరాజు, ఆత్మకూరు (ఎస్) మండల పార్టీ అధ్యక్షుడు బొల్లె సైదులు, యువజన విభాగం అధ్యక్షుడు కోల కరుణాకర్ ముదిరాజ్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఏశబోయిన మల్లేష్, బొమ్మగాని సైదులు, పగిళ్ల శరత్, లింగాల సైదులు, సేవ్యానాయక్, కొన్నె మంజుల, నారాయణదాసు కవిత, కడియం వంశీ, మహేష్ తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సావిత్రిబాయి ఫులే జయంతి సందర్భంగా విద్య, సమానత్వం, సామాజిక చైతన్యం కోసం మరింత కృషి చేయాలని ఈ సందర్భంగా పార్టీ నాయకులు ప్రతిజ్ఞ చేశారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News