PRINT TIME: May 27, 2026 01:45 AM
సామూహిక వివాహాలు ఆదర్శనీయం : ఎస్సై మహేష్ కుమార్
సామూహిక వివాహాలు ఆదర్శనీయం : ఎస్సై మహేష్ కుమార్
January 24, 2026 09:53 PM
181 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు
ఆదోని, జనవరి 24:కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతేకుడ్లూరు గ్రామంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీర్వాదం తీసుకున్న ఎస్సై మహేష్ కుమార్ గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు మరిన్ని గ్రామాల్లో నిర్వహించాలన్నారు. ముఖ్యంగా పేద కుటుంబాలకు అండగా నిలిచే సామూహిక వివాహాల నిర్వహణ ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. ఇతర గ్రామాల్లో అరుదుగా కనిపించే ఈ తరహా కార్యక్రమాలు సంతేకుడ్లూరు గ్రామంలో కొనసాగుతున్నాయంటే అది స్వామివారి అనుగ్రహమేనని కొనియాడారు.
గ్రామ ఐక్యతకు, సామాజిక సమరసతకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. భక్తి, సేవ, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా ఈ బ్రహ్మోత్సవాలు నిలుస్తున్నాయని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, దేవాలయ కమిటీ సభ్యులు, గ్రామ భక్తులు పాల్గొన్నారు. స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి