PRINT TIME: May 27, 2026 01:44 AM
సమూహిక వివాహాలకు కిరాణా సరుకుల విరాళం
సమూహిక వివాహాలకు కిరాణా సరుకుల విరాళం
January 21, 2026 07:10 PM
172 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
ఆదోనిలో టీడీపీ యువ నాయకుడి సేవా
సమూహిక వివాహాలకు రూ.18 వేల కిరాణా విరాళం
ఆదోని:స్థానికం ప్రధాన ప్రతినిధి
రథసప్తమి పర్వదినాన్ని సేవా కార్యక్రమంతో సార్థకం చేస్తూ ఆదోని టీడీపీ యువ నాయకుడు కొంకా సిద్ధార్థ నాయుడు ఆదర్శంగా నిలిచారు. సంతేకుడ్లూరు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ దేవస్థానంలో నిర్వహించనున్న సమూహిక వివాహాలకు అవసరమైన సుమారు రూ.18 వేల విలువైన కిరాణా సరుకులను విరాళంగా అందజేశారు.
పేద కుటుంబాల పెళ్లిళ్లకు చేయూతనిచ్చే ఉద్దేశంతో చేపట్టిన ఈ సేవా కార్యక్రమం స్థానికంగా ప్రశంసలు పొందింది. సమూహిక వివాహాల నిర్వహణకు అవసరమైన నిత్యావసర సరుకులను ముందుగానే అందించడం ద్వారా నిర్వాహకులకు భారం తగ్గిందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.పండుగల సమయంలో సేవా భావన మరింత విస్తరించాలన్న సందేశంతో ముందుకొచ్చిన సిద్ధార్థ నాయుడిని స్థానికులు, ఆలయ నిర్వాహకులు అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి