సంఘటితంగా ఉంటేనే సమస్యలకు పరిష్కారం – ఏఐసీసీ నాయకులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి
సంఘటితంగా ఉంటేనే సమస్యలకు పరిష్కారం – ఏఐసీసీ నాయకులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి
Biksham
సూర్యపేట స్థానికం ప్రతినిధి బిక్షం
ప్రైవేట్ ఎలక్ట్రిషియన్లు సంఘటితంగా ముందుకు సాగితే తమ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించుకోవచ్చని ఏఐసీసీ నాయకులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట పట్టణంలో ప్రైవేట్ ఎలక్ట్రిషియన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్యాలెండర్ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.ఎలక్ట్రిషియన్లు సమాజానికి అత్యంత కీలక సేవలు అందిస్తున్నారని, అయినప్పటికీ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. వాటి పరిష్కారానికి ఐక్యత ఎంతో అవసరమని స్పష్టం చేశారు. సంఘటితంగా పోరాడితే ప్రభుత్వ దృష్టికి సమస్యలను తీసుకెళ్లడం సులభమవుతుందని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కార్మికుడికి చేరేలా కృషి చేస్తామని, ప్రైవేట్ ఎలక్ట్రిషియన్ల సమస్యలపై తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రైవేట్ ఎలక్ట్రిషియన్స్ అసోసియేషన్ నాయకులు, సభ్యులు, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి