Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణలో ఉద్యోగాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. డివైఎఫ్ఐ. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 12:03 PM

సామాజిక కార్యకర్తలకు అంబేద్కర్ ఫోటోతో సత్కారం

సామాజిక కార్యకర్తలకు అంబేద్కర్ ఫోటోతో సత్కారం

సామాజిక కార్యకర్తలకు అంబేద్కర్ ఫోటోతో సత్కారం
January 19, 2026 05:01 PM 76 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తూ, అంబేద్కర్ వాదాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ, భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం నిరంతరం పోరాడుతున్న సామాజిక కార్యకర్తలను మాల మహానాడు జిల్లా కమిటీ సోమవారం ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోను అందజేసి వారికి గౌరవం ప్రదర్శించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాల మహానాడు జిల్లా అధ్యక్షులు పెరుమాండ్ల యాదగిరి మాట్లాడుతూ దేశంలో అంబేద్కర్ సిద్ధాంతాలను బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని, భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ప్రయత్నాలను సమిష్టిగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని, రాజ్యాంగ పరిరక్షణే లక్ష్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రజలు ఐక్యతతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా దొంత సత్యనారాయణ, కంచి మల్లయ్య, బర్రె సుదర్శన్, కొడారి వెంకటేష్, బాకారం లావణ్య, బద్దుల సునీత, అఖిల తదితర సామాజిక కార్యకర్తలను అంబేద్కర్ ఫోటోతో సత్కరించారు. కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా కమిటీ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News