Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:27 AM

సమానత్వ పోరాట యోధురాలు సావిత్రిబాయి పూలే జయంతి

సమానత్వ పోరాట యోధురాలు సావిత్రిబాయి పూలే జయంతి

సమానత్వ పోరాట యోధురాలు సావిత్రిబాయి పూలే జయంతి
January 03, 2026 02:25 PM 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మహిళా విద్య, సామాజిక న్యాయానికి ఆమె చేసిన సేవలు చిరస్మరణీయం : గుంటకండ్ల జగదీష్ రెడ్డి

సూర్యాపేట స్థానికం ప్రతినిధి బిక్షం

మహిళా విద్యకు మార్గదర్శకురాలైన మహానీయురాలు సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత, మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట శాసనసభ్యులు శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి గ ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ, భారతదేశంలో మహిళా విద్యకు తొలి వెలుగు నింపిన మహోన్నత వ్యక్తి సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. కుల వివక్ష, లింగ అసమానతలు ప్రబలంగా ఉన్న కాలంలోనే విద్యనే ఆయుధంగా చేసుకుని సమాజ మార్పుకు ఆమె బాటలు వేసిందని అన్నారు. ఆడపిల్లల విద్య కోసం ఆమె చేసిన పోరాటం నేటి తరాలకు మార్గదర్శకమని పేర్కొన్నారు.

వెనుకబడిన వర్గాలు, దళితులు, మహిళల అభ్యున్నతి కోసం సావిత్రిబాయి పూలే చేసిన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపారు. ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే నిజమైన నివాళి అని, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు, వివిధ సంఘాల పెద్దలు, సామాజిక కార్యకర్తలు పాల్గొని సావిత్రిబాయి పూలేకు ఘన నివాళులు అర్పించారు. ఆమె జయంతి సందర్భంగా మహిళా విద్య, సామాజిక చైతన్యం, సమాన హక్కుల కోసం మరింతగా పోరాటం చేయాలని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News