Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:51 PM

సమానత్వ పోరాట యోధురాలు సావిత్రిబాయి పూలే జయంతి

సమానత్వ పోరాట యోధురాలు సావిత్రిబాయి పూలే జయంతి

సమానత్వ పోరాట యోధురాలు సావిత్రిబాయి పూలే జయంతి
January 03, 2026 02:25 PM 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మహిళా విద్య, సామాజిక న్యాయానికి ఆమె చేసిన సేవలు చిరస్మరణీయం : గుంటకండ్ల జగదీష్ రెడ్డి

సూర్యాపేట స్థానికం ప్రతినిధి బిక్షం

మహిళా విద్యకు మార్గదర్శకురాలైన మహానీయురాలు సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత, మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట శాసనసభ్యులు శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి గ ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ, భారతదేశంలో మహిళా విద్యకు తొలి వెలుగు నింపిన మహోన్నత వ్యక్తి సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. కుల వివక్ష, లింగ అసమానతలు ప్రబలంగా ఉన్న కాలంలోనే విద్యనే ఆయుధంగా చేసుకుని సమాజ మార్పుకు ఆమె బాటలు వేసిందని అన్నారు. ఆడపిల్లల విద్య కోసం ఆమె చేసిన పోరాటం నేటి తరాలకు మార్గదర్శకమని పేర్కొన్నారు.

వెనుకబడిన వర్గాలు, దళితులు, మహిళల అభ్యున్నతి కోసం సావిత్రిబాయి పూలే చేసిన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపారు. ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే నిజమైన నివాళి అని, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు, వివిధ సంఘాల పెద్దలు, సామాజిక కార్యకర్తలు పాల్గొని సావిత్రిబాయి పూలేకు ఘన నివాళులు అర్పించారు. ఆమె జయంతి సందర్భంగా మహిళా విద్య, సామాజిక చైతన్యం, సమాన హక్కుల కోసం మరింతగా పోరాటం చేయాలని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News