సాంకేతిక నైపుణ్యాల పెంపుకు కృత్రిమ మేధస్సు శిక్షణా శిబిరం
సాంకేతిక నైపుణ్యాల పెంపుకు కృత్రిమ మేధస్సు శిక్షణా శిబిరం
Biksham Goud
విద్యార్థులకు పరిశ్రమ అవసరాలపై మార్గదర్శనం
పొన్నేకల్: స్థానిక పొన్నేకల్లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల లో విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించేందుకు “స్కిల్ బిల్డ్ – కృత్రిమ మేధస్సు” అంశంపై ఒక రోజు శిక్షణా శిబిరం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కళాశాల కార్యనిర్వాహక సంచాలకురాలు డాక్టర్ సాయి గీతిక ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేటి డిజిటల్ యుగంలో కృత్రిమ మేధస్సు కీలక పాత్ర పోషిస్తున్నదని, విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభ్యసించి తమ భవిష్యత్తును ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని సూచించారు. భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు కృత్రిమ మేధస్సు, దత్తాంశ శాస్త్రం, సైబర్ భద్రత రంగాల్లో విస్తృతంగా ఉంటాయని తెలిపారు.
కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ జె. లక్ష్మి నారాయణ మాట్లాడుతూ విద్యార్థులు ఇలాంటి శిక్షణా శిబిరాలను సద్వినియోగం చేసుకొని పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. డీన్ డాక్టర్ వి. సుదర్శన్ మాట్లాడుతూ కృత్రిమ మేధస్సు ఆరోగ్యం, విద్య, పరిశ్రమ, వ్యవసాయం వంటి అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోందని, ప్రాయోగిక జ్ఞానం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ప్రత్యేక అతిథిగా పాల్గొన్న ఐబిఎమ్ విభాగాధిపతి రాఘవేందర్ రావు కృత్రిమ మేధస్సు ప్రాథమిక అంశాలు, యంత్ర అభ్యాసం, దత్తాంశ విశ్లేషణపై విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించారు. పరిశ్రమలో అవసరమైన నైపుణ్యాలు, ప్రాజెక్టుల ప్రాముఖ్యత, ఉద్యోగ అవకాశాలపై వివరించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని అనేక సందేహాలను నివృత్తి చేసుకున్నారు. కార్యక్రమంలో శిక్షణా నియామక అధికారి డాక్టర్ రాజేష్, పరిపాలనా అధికారి వైశాలి, డిప్లమా ఇన్చార్జి కృష్ణ ప్రసాద్, డాక్టర్ జ్యోతి, డాక్టర్ ప్రణతి, డాక్టర్ చార్యులు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి