Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 11:47 PM

సిఎంఆర్ఎఫ్ పథకం పేదల జీవితాల్లో వెలుగులు నింపుతోంది: ఎమ్మెల్యే

సిఎంఆర్ఎఫ్ పథకం పేదల జీవితాల్లో వెలుగులు నింపుతోంది: ఎమ్మెల్యే

సిఎంఆర్ఎఫ్ పథకం పేదల జీవితాల్లో వెలుగులు నింపుతోంది: ఎమ్మెల్యే
January 08, 2026 07:21 PM 25 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
భువనగిరిలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ… పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

సిఎంఆర్ఎఫ్ పథకం పేద ప్రజల జీవితాల్లో ఆశా దీపంలా నిలుస్తోందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. భువనగిరి పట్టణంలోని 23వ వార్డు ఇందిరానగర్‌కు చెందిన బర్రె హేమలత, గంగారం శరత్ కుమార్ అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భారీ వైద్య ఖర్చులు భరించిన నేపథ్యంలో, సీఎంఆర్ఎఫ్ సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకున్నారు.

స్థానిక మాజీ కౌన్సిలర్ పడిగెల రేణుక–ప్రదీప్ ఆధ్వర్యంలో సమర్పించిన దరఖాస్తులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను శుక్రవారం భువనగిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనుకోకుండా ప్రమాదాలు లేదా అనారోగ్యాల వల్ల ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ భారీ ఖర్చులు చేసే పేద కుటుంబాలు ఆర్థికంగా కుదేలవకుండా ప్రభుత్వం భరోసా కల్పించడమే సిఎంఆర్ఎఫ్ లక్ష్యమని తెలిపారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమలవుతున్న ఈ సహాయ నిధి పథకం పేద ప్రజల జీవితాల్లో నిజమైన వెలుగులు నింపుతోందని పేర్కొన్నారు.

భువనగిరి నియోజకవర్గంలో గత రెండేళ్లుగా సీఎంఆర్ఎఫ్‌కు ఎంతమంది దరఖాస్తు చేసుకుంటే అంతమందికి చెక్కులు మంజూరు చేయించామని చెప్పారు. పేద ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, అందులో భాగంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని రూ.10 లక్షల వరకు పెంచి నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, బర్రె మహేందర్, కసరబోయిన సాయి, నరేందర్, గోపి బాబు, నువ్వుల రాజు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News