Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 01:45 AM

సైదాపురం–మాటూరులో 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు భూమి పూజ

సైదాపురం–మాటూరులో 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు భూమి పూజ

సైదాపురం–మాటూరులో 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు భూమి పూజ
January 20, 2026 05:25 PM 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
యాదాద్రి భువనగిరి జిల్లా:

యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామంలో నూతనంగా నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రానికి, అలాగే మోటకొండూర్ మండలం మాటూరు గ్రామంలో ఏర్పాటు చేయనున్న మరో 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రానికి శుక్రవారం ఘనంగా భూమి పూజ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని భూమి పూజ చేశారు. ఆయనతో పాటు ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ హనుమంత రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్య మహేందర్ రెడ్డి, విద్యుత్ శాఖ సీనియర్ అధికారులు ఎస్‌ఈ సురేష్, సీఈ బాలస్వామి, డీఈ వెంకటేశ్వర్లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. నూతన ఉపకేంద్రాల ఏర్పాటుతో పరిసర గ్రామాలకు నాణ్యమైన విద్యుత్ అందుబాటులోకి వస్తుందని, వ్యవసాయంతో పాటు పారిశ్రామిక కార్యకలాపాలకు ఊతం లభిస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News