Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణలో ఉద్యోగాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. డివైఎఫ్ఐ. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 12:05 PM

సైదాపురం–మాటూరులో 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు భూమి పూజ

సైదాపురం–మాటూరులో 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు భూమి పూజ

సైదాపురం–మాటూరులో 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు భూమి పూజ
January 20, 2026 05:25 PM 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
యాదాద్రి భువనగిరి జిల్లా:

యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామంలో నూతనంగా నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రానికి, అలాగే మోటకొండూర్ మండలం మాటూరు గ్రామంలో ఏర్పాటు చేయనున్న మరో 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రానికి శుక్రవారం ఘనంగా భూమి పూజ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని భూమి పూజ చేశారు. ఆయనతో పాటు ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ హనుమంత రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్య మహేందర్ రెడ్డి, విద్యుత్ శాఖ సీనియర్ అధికారులు ఎస్‌ఈ సురేష్, సీఈ బాలస్వామి, డీఈ వెంకటేశ్వర్లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. నూతన ఉపకేంద్రాల ఏర్పాటుతో పరిసర గ్రామాలకు నాణ్యమైన విద్యుత్ అందుబాటులోకి వస్తుందని, వ్యవసాయంతో పాటు పారిశ్రామిక కార్యకలాపాలకు ఊతం లభిస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News