Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 04:38 AM

సైదాపురం–మాటూరులో 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు భూమి పూజ

సైదాపురం–మాటూరులో 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు భూమి పూజ

సైదాపురం–మాటూరులో 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు భూమి పూజ
January 20, 2026 05:25 PM 23 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
యాదాద్రి భువనగిరి జిల్లా:

యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామంలో నూతనంగా నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రానికి, అలాగే మోటకొండూర్ మండలం మాటూరు గ్రామంలో ఏర్పాటు చేయనున్న మరో 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రానికి శుక్రవారం ఘనంగా భూమి పూజ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని భూమి పూజ చేశారు. ఆయనతో పాటు ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ హనుమంత రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్య మహేందర్ రెడ్డి, విద్యుత్ శాఖ సీనియర్ అధికారులు ఎస్‌ఈ సురేష్, సీఈ బాలస్వామి, డీఈ వెంకటేశ్వర్లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. నూతన ఉపకేంద్రాల ఏర్పాటుతో పరిసర గ్రామాలకు నాణ్యమైన విద్యుత్ అందుబాటులోకి వస్తుందని, వ్యవసాయంతో పాటు పారిశ్రామిక కార్యకలాపాలకు ఊతం లభిస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News