స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
రామన్నపేట మండలంలోనిసిరిపురం గ్రామ సర్పంచి అంబటి ఉపేంద్ర రవీందర్ రెడ్డి, ఉపసర్పంచి మూడుదుడ్ల అనూషరమేష్ రామన్నపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్ వెంకటేశ్వర్లు ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామానికి సంబంధించిన శాంతి భద్రతలు, అభివృద్ధి పనుల అమలు, ప్రజలకు మెరుగైన పోలీసు సేవల అందుబాటుపై చర్చించారు.వారి వెంట నాయకులు వెంకటేశం, కోనూరు ముత్తయ్య, ఎల్లా సంజీవరెడ్డి, కోనూరు లింగస్వామి, రాపోలు స్వామి, మందడి ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామంలో సామాజిక సౌహార్దం కొనసాగేందుకు పోలీసు శాఖ సహకారం కీలకమని వారు పేర్కొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి