Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:00 PM

సగానికి పైగా తగ్గిన కోడి గుడ్ల ధరలు

సగానికి పైగా తగ్గిన కోడి గుడ్ల ధరలు

సగానికి పైగా తగ్గిన కోడి గుడ్ల ధరలు
March 07, 2026 03:04 PM 69 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధ పరిస్థితుల ప్రభావంతో భారత్ నుంచి కోడి గుడ్ల ఎగుమతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. విదేశాలకు పంపే ఎగుమతులు నిలిచిపోవడంతో దేశంలో గుడ్ల నిల్వలు భారీగా పెరిగాయి. దీంతో మార్కెట్‌లో ధరలు గణనీయంగా పడిపోయాయి.

ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని (ఎన్‌ఈసీసీ) గుడ్ల ధరలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. హోల్‌సేల్ మార్కెట్‌లో ఒక గుడ్డు ధరను కేవలం రూ.3.50గా నిర్ణయించినట్లు ఎన్‌ఈసీసీ ఒక ప్రకటనలో తెలిపింది.

ఎగుమతులు తగ్గిపోవడం, మార్కెట్‌లో నిల్వలు అధికంగా ఉండటం వల్ల ధరలు సగానికి పైగా పడిపోయాయని సంఘం పేర్కొంది. ధరలు తగ్గడంతో కోడి గుడ్ల రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముందని ఆందోళన వ్యక్తమవుతోంది.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News