ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధ పరిస్థితుల ప్రభావంతో భారత్ నుంచి కోడి గుడ్ల ఎగుమతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. విదేశాలకు పంపే ఎగుమతులు నిలిచిపోవడంతో దేశంలో గుడ్ల నిల్వలు భారీగా పెరిగాయి. దీంతో మార్కెట్లో ధరలు గణనీయంగా పడిపోయాయి.
ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని (ఎన్ఈసీసీ) గుడ్ల ధరలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. హోల్సేల్ మార్కెట్లో ఒక గుడ్డు ధరను కేవలం రూ.3.50గా నిర్ణయించినట్లు ఎన్ఈసీసీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఎగుమతులు తగ్గిపోవడం, మార్కెట్లో నిల్వలు అధికంగా ఉండటం వల్ల ధరలు సగానికి పైగా పడిపోయాయని సంఘం పేర్కొంది. ధరలు తగ్గడంతో కోడి గుడ్ల రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముందని ఆందోళన వ్యక్తమవుతోంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి