సదాశివపేటలో అక్కమహాదేవి జయంతి వేడుకలు వైభవంగా నిర్వహణ
సదాశివపేటలో అక్కమహాదేవి జయంతి వేడుకలు వైభవంగా నిర్వహణ
Krishna
సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని అక్కమహాదేవి ఆలయంలో వీరశైవ లింగాయత్ సమాజం ఎడ్ల బజార్ సదాశివపేట వారి ఆధ్వర్యంలో అక్కమహాదేవి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మున్సిపల్ చైర్మన్, వార్డు కౌన్సిలర్ అపర్ణ పాటిల్ పాల్గొని అక్కమహాదేవి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఆమె సేవలను స్మరించుకున్నారు. అనంతరం భక్తి గీతాలు, వచనాల పారాయణం నిర్వహించి ఆలయంలో భక్తి వాతావరణం నెలకొల్పారు.సంఘ అధ్యక్షుడు గందిగా రాజు మాట్లాడుతూ సుమారు 50 సంవత్సరాల క్రితమే సదాశివపేటలో అక్కమహాదేవి ఆలయం నిర్మించబడినట్లు తెలిపారు.అక్కమహాదేవి చూపిన భక్తి మార్గం, సమానత్వ భావన సమాజానికి ఆదర్శమని, స్త్రీ సాధికారతకు ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. సమాజంలో ఐక్యత, నైతిక విలువలు పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షురాలు అన్నపూర్ణతో పాటు వీరశైవ సమాజ మహిళలు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యువత కూడా భారీగా హాజరై వేడుకలను విజయవంతం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి