PRINT TIME: April 10, 2026 12:05 PM
సబితా ఇంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ రామ్ నరసింహ గౌడ్
సబితా ఇంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ రామ్ నరసింహ గౌడ్
January 18, 2026 11:04 AM
44 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అభివృద్ధికి విశేష సేవలందించిన మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే పటోళ్ల సబితా ఇంద్రారెడ్డిని శ్రీ రామకృష్ణ పురం డివిజన్ (35) బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ వీరమళ్ళ రామ్ నరసింహ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు.జిల్లెలగుడాలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో డాక్టర్ రామ్ నరసింహ గౌడ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రాంత అభివృద్ధి అంశాలు, ప్రజా సమస్యలపై స్వల్పంగా చర్చ జరిగినట్లు సమాచారం.రాష్ట్ర రాజకీయాల్లో అనుభవజ్ఞురాలిగా గుర్తింపు పొందిన సబితా ఇంద్రారెడ్డి నాయకత్వాన్ని డాక్టర్ రామ్ నరసింహ గౌడ్ ప్రశంసించారు. మహేశ్వరం నియోజకవర్గ అభివృద్ధికి ఆమె చేపట్టిన కార్యక్రమాలు ప్రజలకు మేలు చేకూర్చాయని పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి