Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 09:09 AM

సావిత్రిబాయి ఫూలే మహిళా విద్యకు మార్గదర్శిని

సావిత్రిబాయి ఫూలే మహిళా విద్యకు మార్గదర్శిని

సావిత్రిబాయి ఫూలే మహిళా విద్యకు మార్గదర్శిని
January 08, 2026 04:18 AM 17 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట, స్థానికం ప్రధాన ప్రతినిధి

సామాజిక మూఢనమ్మకాలను ధైర్యంగా ఎదురించి మహిళా విద్య, సామాజిక చైతన్యానికి బాటలు వేసిన ఆదర్శ మహిళ సావిత్రిబాయి ఫూలే అని మండల విద్యాధికారి జి. జ్యోతి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (TSUTF) ఆధ్వర్యంలో రామన్నపేట ఎమ్మార్సీ కార్యాలయంలో నిర్వహించిన సావిత్రిబాయి ఫూలే జయంతి కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల విద్యాభివృద్ధికి గణనీయమైన సేవలందించి సమాజ అభ్యున్నతికి అంకితమైన ధీర వనితగా ఫూలేను జిల్లా కార్యదర్శులు దొడ్డి స్వామి, కంచి రవికుమార్ కొనియాడారు.

అనంతరం మండల విద్యాధికారి చేతుల మీదుగా TSUTF నూతన విద్యా సంవత్సరం–2026 డైరీ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 2010 తర్వాత నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష మినహాయింపు ఇవ్వాలని, కొత్త పీఆర్సీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల హెల్త్ కార్డులు పూర్తిస్థాయిలో పనిచేసేలా మార్పులు చేయాలని, పదవీ విరమణ వయస్సు పెంచడం వల్ల నిరుద్యోగ సమస్య మరింత తీవ్రమవుతుందని హెచ్చరించారు. అలాగే రిటైర్ అయిన ఉద్యోగులకు అన్ని బెనిఫిట్లు వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ అనిల్ కుమార్, మండల అధ్యక్షుడు శేఖర్, ప్రధాన కార్యదర్శి మంకాల కుమారస్వామి, ఉపాధ్యక్షుడు గాసీరాం, కోశాధికారి కర్నె త్రివేణి ప్రసాద్, FWF మండల కన్వీనర్ మేడి మధుబాబు, సీనియర్ నాయకులు జగదీశ్వర చారి, జహంగీర్, కృష్ణయ్య, రాకేష్, ఎమ్మార్సీ సిబ్బంది శివకుమార్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News