సావిత్రిబాయి ఫూలే మహిళా విద్యకు మార్గదర్శిని
సావిత్రిబాయి ఫూలే మహిళా విద్యకు మార్గదర్శిని
Editor Desk
రామన్నపేట, స్థానికం ప్రధాన ప్రతినిధి
సామాజిక మూఢనమ్మకాలను ధైర్యంగా ఎదురించి మహిళా విద్య, సామాజిక చైతన్యానికి బాటలు వేసిన ఆదర్శ మహిళ సావిత్రిబాయి ఫూలే అని మండల విద్యాధికారి జి. జ్యోతి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (TSUTF) ఆధ్వర్యంలో రామన్నపేట ఎమ్మార్సీ కార్యాలయంలో నిర్వహించిన సావిత్రిబాయి ఫూలే జయంతి కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా సావిత్రిబాయి ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగు, బలహీన వర్గాల విద్యాభివృద్ధికి గణనీయమైన సేవలందించి సమాజ అభ్యున్నతికి అంకితమైన ధీర వనితగా ఫూలేను జిల్లా కార్యదర్శులు దొడ్డి స్వామి, కంచి రవికుమార్ కొనియాడారు.
అనంతరం మండల విద్యాధికారి చేతుల మీదుగా TSUTF నూతన విద్యా సంవత్సరం–2026 డైరీ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 2010 తర్వాత నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష మినహాయింపు ఇవ్వాలని, కొత్త పీఆర్సీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల హెల్త్ కార్డులు పూర్తిస్థాయిలో పనిచేసేలా మార్పులు చేయాలని, పదవీ విరమణ వయస్సు పెంచడం వల్ల నిరుద్యోగ సమస్య మరింత తీవ్రమవుతుందని హెచ్చరించారు. అలాగే రిటైర్ అయిన ఉద్యోగులకు అన్ని బెనిఫిట్లు వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ అనిల్ కుమార్, మండల అధ్యక్షుడు శేఖర్, ప్రధాన కార్యదర్శి మంకాల కుమారస్వామి, ఉపాధ్యక్షుడు గాసీరాం, కోశాధికారి కర్నె త్రివేణి ప్రసాద్, FWF మండల కన్వీనర్ మేడి మధుబాబు, సీనియర్ నాయకులు జగదీశ్వర చారి, జహంగీర్, కృష్ణయ్య, రాకేష్, ఎమ్మార్సీ సిబ్బంది శివకుమార్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి