PRINT TIME: April 10, 2026 09:10 AM
సామాజిక సేవలో ముందంజలో ఎన్ఎస్ఎస్ విద్యార్థులు
సామాజిక సేవలో ముందంజలో ఎన్ఎస్ఎస్ విద్యార్థులు
January 08, 2026 08:00 PM
19 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల సేవలు అభినందనీయం
స్థానికం ప్రధాన ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
హయత్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో పసుమాముల, కళానగర్ గ్రామాల్లో నిర్వహించిన శీతాకాల ప్రత్యేక శిబిరం గురువారం ముగిసింది. వారం రోజుల పాటు పాఠశాలలు, గ్రామ ప్రధాన కూడళ్ల శుభ్రత, మొక్కల నాటకం వంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్న ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల సేవలు అభినందనీయమని కళాశాల ప్రిన్సిపాల్ డా. పి. సురేష్ బాబు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన స్థానిక ప్రజా ప్రతినిధి కొత్తపల్లి జైపాల్ రెడ్డి, గ్రామాల్లో చేసిన సేవలు విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంపొందిస్తాయని అన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు, వాలంటీర్లు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి