రుణమాఫీ హామీ అమలు కాలేదంటూ హైకోర్టును ఆశ్రయించిన రైతు
రుణమాఫీ హామీ అమలు కాలేదంటూ హైకోర్టును ఆశ్రయించిన రైతు
Editor Desk
రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వ హామీ అమలు కాలేదని ఆరోపిస్తూ ఓ రైతు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం రాజకీయంగా చర్చకు దారి తీసింది.ప్రభుత్వం జారీ చేసిన జీవో 567 ప్రకారం రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాల్సి ఉన్నప్పటికీ, తనకు ఉన్న రూ.1.50 లక్షల రుణం ఇప్పటివరకు మాఫీ కాలేదని పిటిషన్లో పేర్కొన్నాడు.ఈ పిటిషన్ను యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం జంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు నరసింహారెడ్డి హైకోర్టులో దాఖలు చేశాడు.విచారణ సందర్భంగా ప్రభుత్వ తరఫున హాజరైన న్యాయవాది కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరడంతో, హైకోర్టు తదుపరి విచారణకు వాయిదా వేసింది.
రుణమాఫీ హామీల అమలుపై ఇప్పటికే అనేక సందేహాలు వ్యక్తమవుతున్న వేళ, ఈ పిటిషన్ ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచే అవకాశముందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి