Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 11:45 PM

రుణమాఫీ హామీ అమలు కాలేదంటూ హైకోర్టును ఆశ్రయించిన రైతు

రుణమాఫీ హామీ అమలు కాలేదంటూ హైకోర్టును ఆశ్రయించిన రైతు

రుణమాఫీ హామీ అమలు కాలేదంటూ హైకోర్టును ఆశ్రయించిన రైతు
January 12, 2026 10:15 AM 81 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వ హామీ అమలు కాలేదని ఆరోపిస్తూ ఓ రైతు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం రాజకీయంగా చర్చకు దారి తీసింది.ప్రభుత్వం జారీ చేసిన జీవో 567 ప్రకారం రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాల్సి ఉన్నప్పటికీ, తనకు ఉన్న రూ.1.50 లక్షల రుణం ఇప్పటివరకు మాఫీ కాలేదని పిటిషన్‌లో పేర్కొన్నాడు.ఈ పిటిషన్‌ను యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం జంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు నరసింహారెడ్డి హైకోర్టులో దాఖలు చేశాడు.విచారణ సందర్భంగా ప్రభుత్వ తరఫున హాజరైన న్యాయవాది కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరడంతో, హైకోర్టు తదుపరి విచారణకు వాయిదా వేసింది.

రుణమాఫీ హామీల అమలుపై ఇప్పటికే అనేక సందేహాలు వ్యక్తమవుతున్న వేళ, ఈ పిటిషన్ ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచే అవకాశముందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News