Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 08:05 AM

రుణమాఫీ హామీ అమలు కాలేదంటూ హైకోర్టును ఆశ్రయించిన రైతు

రుణమాఫీ హామీ అమలు కాలేదంటూ హైకోర్టును ఆశ్రయించిన రైతు

రుణమాఫీ హామీ అమలు కాలేదంటూ హైకోర్టును ఆశ్రయించిన రైతు
January 12, 2026 10:15 AM 85 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వ హామీ అమలు కాలేదని ఆరోపిస్తూ ఓ రైతు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం రాజకీయంగా చర్చకు దారి తీసింది.ప్రభుత్వం జారీ చేసిన జీవో 567 ప్రకారం రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాల్సి ఉన్నప్పటికీ, తనకు ఉన్న రూ.1.50 లక్షల రుణం ఇప్పటివరకు మాఫీ కాలేదని పిటిషన్‌లో పేర్కొన్నాడు.ఈ పిటిషన్‌ను యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం జంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు నరసింహారెడ్డి హైకోర్టులో దాఖలు చేశాడు.విచారణ సందర్భంగా ప్రభుత్వ తరఫున హాజరైన న్యాయవాది కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరడంతో, హైకోర్టు తదుపరి విచారణకు వాయిదా వేసింది.

రుణమాఫీ హామీల అమలుపై ఇప్పటికే అనేక సందేహాలు వ్యక్తమవుతున్న వేళ, ఈ పిటిషన్ ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచే అవకాశముందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News