Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:06 AM

రుణమాఫీ హామీ అమలు కాలేదంటూ హైకోర్టును ఆశ్రయించిన రైతు

రుణమాఫీ హామీ అమలు కాలేదంటూ హైకోర్టును ఆశ్రయించిన రైతు

రుణమాఫీ హామీ అమలు కాలేదంటూ హైకోర్టును ఆశ్రయించిన రైతు
12-01-2026 90 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వ హామీ అమలు కాలేదని ఆరోపిస్తూ ఓ రైతు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం రాజకీయంగా చర్చకు దారి తీసింది.ప్రభుత్వం జారీ చేసిన జీవో 567 ప్రకారం రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాల్సి ఉన్నప్పటికీ, తనకు ఉన్న రూ.1.50 లక్షల రుణం ఇప్పటివరకు మాఫీ కాలేదని పిటిషన్‌లో పేర్కొన్నాడు.ఈ పిటిషన్‌ను యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం జంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు నరసింహారెడ్డి హైకోర్టులో దాఖలు చేశాడు.విచారణ సందర్భంగా ప్రభుత్వ తరఫున హాజరైన న్యాయవాది కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరడంతో, హైకోర్టు తదుపరి విచారణకు వాయిదా వేసింది.

రుణమాఫీ హామీల అమలుపై ఇప్పటికే అనేక సందేహాలు వ్యక్తమవుతున్న వేళ, ఈ పిటిషన్ ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచే అవకాశముందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

Sthanikam

రుణమాఫీ హామీ అమలు కాలేదంటూ హైకోర్టును ఆశ్రయించిన రైతు

Article Image

రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వ హామీ అమలు కాలేదని ఆరోపిస్తూ ఓ రైతు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం రాజకీయంగా చర్చకు దారి తీసింది.ప్రభుత్వం జారీ చేసిన జీవో 567 ప్రకారం రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాల్సి ఉన్నప్పటికీ, తనకు ఉన్న రూ.1.50 లక్షల రుణం ఇప్పటివరకు మాఫీ కాలేదని పిటిషన్‌లో పేర్కొన్నాడు.ఈ పిటిషన్‌ను యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం జంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు నరసింహారెడ్డి హైకోర్టులో దాఖలు చేశాడు.విచారణ సందర్భంగా ప్రభుత్వ తరఫున హాజరైన న్యాయవాది కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరడంతో, హైకోర్టు తదుపరి విచారణకు వాయిదా వేసింది.

రుణమాఫీ హామీల అమలుపై ఇప్పటికే అనేక సందేహాలు వ్యక్తమవుతున్న వేళ, ఈ పిటిషన్ ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచే అవకాశముందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News