రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలి మృతి – పలువురికి తీవ్ర గాయాలు
రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయురాలి మృతి – పలువురికి తీవ్ర గాయాలు
Krishna
ఉమ్మడి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ:తుంగతుర్తి నియోజకవర్గంలోని అర్వపల్లి గ్రామ శివారులో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాఠశాలలు తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో నల్గొండ నుంచి కారులో పాఠశాలలకు వెళ్తున్న ఉపాధ్యాయులు ఈ ప్రమాదానికి గురయ్యారు.వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన పల్టీలు కొట్టడంతో ప్రమాదం తీవ్రతరమైంది. ఈ ఘటనలో మొత్తం ఐదుగురు ఉపాధ్యాయులు ప్రయాణిస్తుండగా, అందులో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు.ప్రమాదంలో ఉపాధ్యాయురాలు కల్పన అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు హెడ్మాస్టర్లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో రావులపల్లి హెడ్మాస్టర్తో పాటు మరో హెడ్మాస్టర్ తులసి ఉన్నట్లు సమాచారం. ప్రమాద తీవ్రత కారణంగా వారిని వెంటనే 108 అంబులెన్సులో సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనతో మృతురాలి కుటుంబ సభ్యులు, సహచర ఉపాధ్యాయులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సంఘటన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి