రోడ్డు భద్రతే ప్రాణ రక్షణ – రామన్నపేటలో సీఐ అవగాహన
రోడ్డు భద్రతే ప్రాణ రక్షణ – రామన్నపేటలో సీఐ అవగాహన
Editor Desk
స్థానికకం ప్రధాన ప్రతినిధి
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని రామన్నపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ…రోడ్డు ప్రయాణం చేసే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి, వాహనం నడిపేటప్పుడు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ పత్రాలు తప్పనిసరిగా ఉండాలని సూచించారు.ముఖ్యంగా మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపకూడదని, అలాగే మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం అత్యంత ప్రమాదకరమని ప్రజలకు స్పష్టం చేశారు.
రోడ్డు ప్రమాదాల వల్ల అనేక మంది శాశ్వత వికలాంగులుగా మారుతున్నారని, మరెందరో తమ ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు.ఈ అవగాహన కార్యక్రమంలోప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, స్థానిక వార్డు మెంబర్, డాన్ బాస్కో పాఠశాల హెడ్మాస్టర్ జానీ, అలాగే పోలీస్ సిబ్బంది ఎం. సురేందర్ (ఏఎస్ఐ), కమలాకర్, మల్లికార్జున్, సత్యనారాయణ, స్వామి, నరసింహ, ప్రవీణ్, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి