రోడ్డు భద్రతపై గ్రామసభ — ప్రజల జాగ్రత్తలే ప్రాణరక్షణకు మార్గం
రోడ్డు భద్రతపై గ్రామసభ — ప్రజల జాగ్రత్తలే ప్రాణరక్షణకు మార్గం
Editor Desk
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామంలో నిర్వహించిన “రోడ్డు భద్రత గ్రామసభ”లో సర్పంచ్ జక్క రాఘవేందర్ రెడ్డి ప్రజలకు కీలక సూచనలు చేశారు. రోడ్లపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని ఆయన సూచించారు.
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించే వారు సీట్బెల్ట్ పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలని తెలిపారు. అతివేగం ప్రమాదాలకు ప్రధాన కారణమని హెచ్చరిస్తూ, వేగ నియంత్రణ పాటించాలని కోరారు.
ప్రయాణ సమయంలో కుటుంబ సభ్యులు మన కోసం ఎదురుచూస్తున్నారని గుర్తుంచుకుని బాధ్యతగా నడుచుకోవాలని సూచించారు. మద్యం లేదా ఇతర మత్తు పదార్థాలు సేవించి వాహనం నడపడం, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వంటి అలవాట్లు ప్రాణాంతకమని హెచ్చరించారు.
రోడ్డు దాటేటప్పుడు ఇరువైపులా జాగ్రత్తగా చూసి దాటాలని, 18 సంవత్సరాల లోపు పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని తల్లిదండ్రులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, గ్రామ సెక్రటరీ, వార్డ్ సభ్యులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ సభ నిర్వహించబడింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి