రోడ్డు భద్రతకు ప్రాధాన్యత:హెల్మెట్తో వాహనం నడిపిన వ్యక్తికి సీఐ ప్రశంసలు
రోడ్డు భద్రతకు ప్రాధాన్యత:హెల్మెట్తో వాహనం నడిపిన వ్యక్తికి సీఐ ప్రశంసలు
Krishna
సంగారెడ్డి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ:రోడ్డు భద్రతపై అవగాహన పెంచే దిశగా జహీరాబాద్ రూరల్ సీఐ హనుమంతు ప్రశంసనీయమైన చర్యలు చేపట్టారు.హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనం నడుపుతున్న వాహనదారుడిని ఆపి, అతని బాధ్యతాయుతమైన ప్రవర్తనను అభినందించారు. వాహనం నడుపుతున్న సమయంలో హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాల సమయంలో ప్రాణ నష్టం తగ్గే అవకాశం ఉంటుందని సీఐ తెలిపారు.ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, హెల్మెట్ ధరించి ప్రయాణించాలన్నారు. ముఖ్యంగా యువత రోడ్డు భద్రతపై మరింత శ్రద్ధ వహించి, తమ కుటుంబాల భవిష్యత్తును కాపాడుకోవాలన్నారు. హెల్మెట్ ధరించడం ఒక చట్టపరమైన బాధ్యత మాత్రమే కాకుండా, ప్రతి ఒక్కరి వ్యక్తిగత భద్రతకూ అవసరమని ఆయన స్పష్టం చేశారు.ఈ సందర్భంగా హెల్మెట్ ధరించి వాహనం నడిపిన వాహనదారుడు పోలీసు శాఖకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో హద్నూర్ ఎస్ఐ దోమ సుజిత్ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి