Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుడి బండలా మారిన గ్యాస్ బండి… క్యూలో నిల్చొని అలసిపోయిన వినియోగదారులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 10:38 AM

రంగమ్మగూడెంలో మహిళా సృజనోత్సవం – అవినాష్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

రంగమ్మగూడెంలో మహిళా సృజనోత్సవం – అవినాష్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

రంగమ్మగూడెంలో మహిళా సృజనోత్సవం – అవినాష్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు
January 16, 2026 02:16 PM 228 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రంగమ్మగూడెంలో ఉత్సాహంగా ముగ్గుల పోటీలు

స్థానిక ప్రధాన ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కక్కిరేణి గ్రామపంచాయతీ పరిధిలోని రంగమ్మగూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ 10వ వార్డు సభ్యుడు వంగాల అవినాష్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. పండుగ వాతావరణంలో సాగిన ఈ కార్యక్రమానికి గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.

ముగ్గుల పోటీలో విజేతలుగా

ఫస్ట్ ప్రైజ్ – మాండ్ర పూజ,

సెకండ్ ప్రైజ్ – మద్దెగళ్ల ఉమా,

థర్డ్ ప్రైజ్ – పల్సం సంతోష నిలిచారు. విజేతలకు వంగాల అవినాష్ తన వంతుగా ఆర్థిక సహాయంతో బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ, రంగమ్మగూడెం మహిళలు మరింత చైతన్యవంతులుగా ఎదగాలని, రాబోయే రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. మహిళా శక్తిని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోంగార్డు శ్రీశైలం యాదవ్ హాజరై మహిళలను అభినందించారు.ఈ వేడుకలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముద్రబోయిన మల్లయ్య, వంగాల ఉపేందర్, ముద్రబోయిన ఆంజనేయులు, ముద్రబోయిన లింగస్వామి, మద్దెగళ్ల శీను, మద్దెగళ్ల ఉప్పలయ్యతో పాటు గ్రామ యువకులు, మహిళలు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News