Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 10:53 AM

రంజాన్ పర్వదినం సందర్భంగా ఇఫ్తార్ విందు ఏర్పాట్లపై కాంగ్రెస్ నేతల సమీక్ష సమావేశం

రంజాన్ పర్వదినం సందర్భంగా ఇఫ్తార్ విందు ఏర్పాట్లపై కాంగ్రెస్ నేతల సమీక్ష సమావేశం

రంజాన్ పర్వదినం సందర్భంగా ఇఫ్తార్ విందు ఏర్పాట్లపై కాంగ్రెస్ నేతల సమీక్ష సమావేశం
February 24, 2026 09:03 AM 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Biksham Goud

జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అయిన రెడ్ హౌస్‌లో రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం మైనారిటీ సోదరులకు ప్రతి ఏడాది నిర్వహించే ఇఫ్తార్ విందు ఏర్పాట్లపై ప్రముఖ నాయకులు మైనారిటీ ప్రతినిధులతో సమావేశమై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ముస్లిం సోదరులతో మాట్లాడి, రంజాన్ మాసం పవిత్రతను కాపాడుతూ ఐక్యతా భావంతో ఇఫ్తార్ విందును విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా ఘనంగా కార్యక్రమం జరగాలని ఆకాంక్షించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు కొప్పుల వేణారెడ్డి మాట్లాడుతూ మైనారిటీ సోదరులతో కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధం మరింత బలపడాలని అన్నారు. మున్సిపల్ ఛైర్మన్ మొరిశెట్టి నివేదిత లక్షాది పట్టణ ప్రజల సహకారంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ ఉపాధ్యక్షుడు యం.డి. షఫీ ఉల్లా, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యం.డి. అంజద్ అలి తదితరులు మాట్లాడుతూ రంజాన్ పర్వదినం సందర్భంగా సోదరభావం, సామరస్యాన్ని పెంపొందించేలా ఇఫ్తార్ విందు నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.

ఈ సమావేశంలో మైనారిటీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News