Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అణగారిన వర్గాల ఆశాజ్యోతి పూలేకు రామన్నపేట లో ఘన నివాళి సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 02:48 PM

రంజాన్ పర్వదినం సందర్భంగా ఇఫ్తార్ విందు ఏర్పాట్లపై కాంగ్రెస్ నేతల సమీక్ష సమావేశం

రంజాన్ పర్వదినం సందర్భంగా ఇఫ్తార్ విందు ఏర్పాట్లపై కాంగ్రెస్ నేతల సమీక్ష సమావేశం

రంజాన్ పర్వదినం సందర్భంగా ఇఫ్తార్ విందు ఏర్పాట్లపై కాంగ్రెస్ నేతల సమీక్ష సమావేశం
February 24, 2026 09:03 AM 97 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అయిన రెడ్ హౌస్‌లో రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం మైనారిటీ సోదరులకు ప్రతి ఏడాది నిర్వహించే ఇఫ్తార్ విందు ఏర్పాట్లపై ప్రముఖ నాయకులు మైనారిటీ ప్రతినిధులతో సమావేశమై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ముస్లిం సోదరులతో మాట్లాడి, రంజాన్ మాసం పవిత్రతను కాపాడుతూ ఐక్యతా భావంతో ఇఫ్తార్ విందును విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా ఘనంగా కార్యక్రమం జరగాలని ఆకాంక్షించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు కొప్పుల వేణారెడ్డి మాట్లాడుతూ మైనారిటీ సోదరులతో కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధం మరింత బలపడాలని అన్నారు. మున్సిపల్ ఛైర్మన్ మొరిశెట్టి నివేదిత లక్షాది పట్టణ ప్రజల సహకారంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ ఉపాధ్యక్షుడు యం.డి. షఫీ ఉల్లా, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యం.డి. అంజద్ అలి తదితరులు మాట్లాడుతూ రంజాన్ పర్వదినం సందర్భంగా సోదరభావం, సామరస్యాన్ని పెంపొందించేలా ఇఫ్తార్ విందు నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు.

ఈ సమావేశంలో మైనారిటీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News