Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హెడ్ కానిస్టేబుల్ అంగోతు యాదగిరికి ఘన నివాళి పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 02:41 PM

రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి

రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి

రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి
January 27, 2026 06:37 PM 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కలెక్టర్‌కు అంగన్వాడీ యూనియన్ వినతి

యాదాద్రి భువనగిరి:స్థానికం ప్రధాన ప్రతినిధి

గత సంవత్సరం జూలై నెలలో రిటైర్మెంట్ పొందిన అంగన్వాడీ టీచర్లకు ఇప్పటివరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందకపోవడం దురదృష్టకరమని, వెంటనే వాటిని చెల్లించాలని కోరుతూ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షురాలు బూరుగు స్వప్న, జిల్లా ప్రధాన కార్యదర్శి చిలివేరు రమాకుమారి ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యూనియన్ ఆధ్వర్యంలో అనేక దశల్లో సాగిన పోరాటాల ఫలితంగా రిటైర్మెంట్ పొందిన అంగన్వాడీ టీచర్లకు రెండు లక్షల రూపాయలు, ఆయాలకు లక్ష రూపాయల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రకటించిన ప్రభుత్వం వాటిని ఇప్పటివరకు అమలు చేయకపోవడం తీవ్ర ఆవేదనకు గురిచేస్తోందన్నారు. పదవీ విరమణ చేసిన మహిళా ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిని ప్రభుత్వం గుర్తించాలని కోరారు.రిటైర్మెంట్ బెనిఫిట్స్‌తో పాటు ఎలాంటి షరతులు లేకుండా పెన్షన్ సౌకర్యాన్ని కూడా కల్పించాలని కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు. ఈ వినతిపత్రాన్ని జిల్లా కలెక్టరేట్‌లో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ జగన్మోహన్ ప్రసాద్‌కు అందజేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు దాసరి పాండు, రిటైర్మెంట్ పొందిన అంగన్వాడీ కార్యకర్తలు అంజమ్మ, తులసమ్మ, లక్ష్మమ్మ, వరలక్ష్మీ, వెంకమ్మ, అంజమ్మ తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News