Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలంగాణ పోలీసు క్రీడల్లో మూడు విభాగాల్లో కాంస్య పతకాలు సాధించి నల్లగొండ ఖ్యాతిని నిలబెట్టిన షకీర్ 18 ఏళ్ల తర్వాత భువనగిరి చేనేత సంఘానికి ఎన్నికలు..చైర్మన్‌గా ఏలే సుధాకర్ ఎన్నిక మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 10:31 AM

రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి

రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి

రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి
January 27, 2026 06:37 PM 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కలెక్టర్‌కు అంగన్వాడీ యూనియన్ వినతి

యాదాద్రి భువనగిరి:స్థానికం ప్రధాన ప్రతినిధి

గత సంవత్సరం జూలై నెలలో రిటైర్మెంట్ పొందిన అంగన్వాడీ టీచర్లకు ఇప్పటివరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందకపోవడం దురదృష్టకరమని, వెంటనే వాటిని చెల్లించాలని కోరుతూ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షురాలు బూరుగు స్వప్న, జిల్లా ప్రధాన కార్యదర్శి చిలివేరు రమాకుమారి ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యూనియన్ ఆధ్వర్యంలో అనేక దశల్లో సాగిన పోరాటాల ఫలితంగా రిటైర్మెంట్ పొందిన అంగన్వాడీ టీచర్లకు రెండు లక్షల రూపాయలు, ఆయాలకు లక్ష రూపాయల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రకటించిన ప్రభుత్వం వాటిని ఇప్పటివరకు అమలు చేయకపోవడం తీవ్ర ఆవేదనకు గురిచేస్తోందన్నారు. పదవీ విరమణ చేసిన మహిళా ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిని ప్రభుత్వం గుర్తించాలని కోరారు.రిటైర్మెంట్ బెనిఫిట్స్‌తో పాటు ఎలాంటి షరతులు లేకుండా పెన్షన్ సౌకర్యాన్ని కూడా కల్పించాలని కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు. ఈ వినతిపత్రాన్ని జిల్లా కలెక్టరేట్‌లో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ జగన్మోహన్ ప్రసాద్‌కు అందజేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు దాసరి పాండు, రిటైర్మెంట్ పొందిన అంగన్వాడీ కార్యకర్తలు అంజమ్మ, తులసమ్మ, లక్ష్మమ్మ, వరలక్ష్మీ, వెంకమ్మ, అంజమ్మ తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News