అత్యవసర మందులు ముందుగానే కొనుగోలు చేయాలని టీఎస్ డ్రగ్ కంట్రోల్ సూచన.
దేశవ్యాప్తంగా రేపు మందుల దుకాణాలు బంద్ కానున్న నేపథ్యంలో ప్రజలు అత్యవసర మందులను ముందుగానే కొనుగోలు చేసుకోవాలని తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అడ్వైజరీ జారీ చేసింది. మెడికల్ షాపుల బంద్ కారణంగా అవసరమైన మందులు అందుబాటులో లేక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, రెగ్యులర్గా మందులు వాడే వారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఆస్పత్రుల్లో అత్యవసర సేవలు కొనసాగనున్నప్పటికీ, సాధారణ మెడికల్ షాపులు మూసివేయబడే అవకాశం ఉందని తెలిపారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి