Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధితులను పరామర్శించేందుకూ అడ్డంకులా?. “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 11:41 AM

రెడ్డి గర్జన దశమ వార్షికోత్సవం: ఉగాది పురస్కారాలతో ప్రముఖుల సన్మానం

రెడ్డి గర్జన దశమ వార్షికోత్సవం: ఉగాది పురస్కారాలతో ప్రముఖుల సన్మానం

రెడ్డి గర్జన దశమ వార్షికోత్సవం: ఉగాది పురస్కారాలతో ప్రముఖుల సన్మానం
17-03-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ఉభయ తెలుగు రాష్ట్రాలలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరచిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులు, మేధావులను గుర్తిస్తూ రెడ్డి గర్జన మాసపత్రిక దశమ వార్షికోత్సవం సందర్భంగా ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. స్నేహల మీడియా పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన ప్రతిభావంతులను సన్మానించి అవార్డులు అందజేశారు.

ఈ సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా, చిట్యాల మండలంలోని తాళ్ల వెల్లంల గ్రామానికి చెందిన రాష్ట్ర రైతురత్న అవార్డు గ్రహీత పజ్జురు అజయ్ కుమార్ రెడ్డి కూడా ఎంపికయ్యాడు. వ్యవసాయ రంగంలో చేసిన విశిష్ట సేవలకు గాను ఆయనకు ఈ గౌరవం లభించింది.

కార్యక్రమంలో రెడ్డి జాగృతి సంపాదకుడు గుర్రం పాపి రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి, రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ బోర్డ్ చైర్మన్ మల్ రెడ్డి రంగారెడ్డి, నటి మరియు వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి శామల పాల్గొని అజయ్ కుమార్ రెడ్డిని సన్మానించి అవార్డు అందజేశారు.

ఈ సన్మానం ద్వారా గ్రామీణ స్థాయిలో ప్రతిభ కనబరచిన రైతులకు ప్రోత్సాహం లభిస్తుందని నిర్వాహకులు తెలిపారు.

Sthanikam

రెడ్డి గర్జన దశమ వార్షికోత్సవం: ఉగాది పురస్కారాలతో ప్రముఖుల సన్మానం

Article Image

ఉభయ తెలుగు రాష్ట్రాలలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరచిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులు, మేధావులను గుర్తిస్తూ రెడ్డి గర్జన మాసపత్రిక దశమ వార్షికోత్సవం సందర్భంగా ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. స్నేహల మీడియా పబ్లికేషన్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన ప్రతిభావంతులను సన్మానించి అవార్డులు అందజేశారు.

ఈ సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా, చిట్యాల మండలంలోని తాళ్ల వెల్లంల గ్రామానికి చెందిన రాష్ట్ర రైతురత్న అవార్డు గ్రహీత పజ్జురు అజయ్ కుమార్ రెడ్డి కూడా ఎంపికయ్యాడు. వ్యవసాయ రంగంలో చేసిన విశిష్ట సేవలకు గాను ఆయనకు ఈ గౌరవం లభించింది.

కార్యక్రమంలో రెడ్డి జాగృతి సంపాదకుడు గుర్రం పాపి రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి, రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ బోర్డ్ చైర్మన్ మల్ రెడ్డి రంగారెడ్డి, నటి మరియు వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి శామల పాల్గొని అజయ్ కుమార్ రెడ్డిని సన్మానించి అవార్డు అందజేశారు.

ఈ సన్మానం ద్వారా గ్రామీణ స్థాయిలో ప్రతిభ కనబరచిన రైతులకు ప్రోత్సాహం లభిస్తుందని నిర్వాహకులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News